జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జైలుకు వెళ్ళారు.! అదీ, రాజమండ్రి కేంద్ర కారాగానికి. అందునా, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడితో ములాఖత్ కోసం. టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబుని స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ సీఐడీ ఇటీవల అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
చంద్రబాబు మీద ఈ కేసుకు సంబంధించి ఆరోపణల తాలూకు మొత్తం 371 కోట్లు.! అంటే, ఈ మొత్తానికి స్కామ్ జరిగిందన్నది సీఐడీ చేస్తున్న అభియోగం. కాదు కాదు, 240 కోట్లు మాత్రమే.. అన్నది ఇంకో వాదన.! సరే, ఏ వాద ఎలా వున్నా.. గట్టిగా 500 కోట్ల స్కామ్ కూడా కాదది.. ఒకవేళ అది నిజంగా జరిగి వుంటే.! అది మళ్ళీ వేరే చర్చ.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్టయిన చంద్రబాబుని పవన్ కళ్యాణ్ పరామర్శించడమేంటని ప్రశ్నిస్తోంది అధికార యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ.. అదేనండీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.! అవినీతి ఆరోపణల్లో నిండా మునిగిపోయిన వైసీపీ, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదం కాక మరేమిటి.?
గతంలో, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జైలుపాలయ్యారు.. అదీ అక్రమాస్తుల కేసుకి సంబంధించి. తండ్రి వైఎస్సార్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని, తనయుడు వైఎస్ జగన్ లక్ష కోట్లు దోచేశాడన్నది ప్రధాన అభియోగం. సీబీఐ ఆయన్ని అరెస్టు చేసింది. సుమారు 43 వేల కోట్ల స్కామ్గా తేల్చింది అప్పట్లో సీబీఐ.
సుమారు ఏడాదిన్నర జైల్లో వున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అప్పట్లో వైసీపీ కార్యకలాపాలన్నీ వైఎస్ జగన్ ‘రిమాండ్ ఖైదీ’గా వున్న జైలు కేంద్రంగానే సాగేవి. పలువురు రాజకీయ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని జైల్లో ములాఖల్ అయ్యి.. పార్టీ వ్యవహారాల గురించి చర్చించేవారు.
అప్పట్లో అది రాజకీయం కాదా.? టీడీపీ – జనసేన మధ్య రాజకీయ స్నేహం చిగురించిన దరిమిలా, చంద్రబాబుతో జనసేన అధినేత ములాఖత్ అయితే, అది అభ్యంతరకరమా.? అయినా, చంద్రబాబు మీద మోపబడ్డ అభియోగానికి సంబంధించి, ‘క్వాష్ పిటిషన్’ దాఖలైంది. దానికి తోడు, పోయాయని చెబుతున్న డబ్బుల లెక్క గురించి సీఐడీ సరిగ్గా చెప్పలేకపోతోందాయె.!
అంతిమ లబ్దిదారు చంద్రబాబు.. అనడానికి సరైన సాక్ష్యాలు సీఐడీ చూపనప్పుడు, చంద్రబాబుని నిందితుడి అయినా ఎలా చూడగలం.? అన్నది ఓ వాదన. ఎవరి గోల వారిదే.! అవినీతి బురదలో నిండా మునిగిపోయిన వైసీపీ, జనసేనానికి అవినీతి మరక అంటించాలని చేస్తున్న ప్రయత్నం జస్ట్ హాస్యాస్పదం అంతే.!