Switch to English

మోడీకి జగన్‌ ‘ప్రత్యేక హోదా లేఖ’.. తెరవెనుక కథేంటి.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,424FansLike
57,764FollowersFollow

ప్రధాని నరేంద్ర మోడీకి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఓ లేఖ రాశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ రాసిన లేఖ అది. ఇలాంటి లేఖలు, కేంద్రానికి కొన్ని వేలు, లక్షలు వెళ్ళి వుంటాయి.. వివిధ మార్గాల్లో. గతంలో చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు కూడా ఇలాంటి లేఖలు చాలానే వెళ్ళాయి. కానీ, కేంద్రం పట్టించుకోలేదు. ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు జరిగితే, కేంద్రం లైట్‌ తీసుకుంది.

అప్పట్లో కేంద్ర మంత్రిగా పనిచేసిన సుజనా చౌదరి, ‘తమిళనాడులో జల్లికట్టులా ఆంధ్రప్రదేశ్‌లో పందులాట ఆడుకోండి..’ అంటూ ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తోన్న ఉద్యమకారులపై సెటైర్లు వేశారు. అప్పట్లో ఆయన టీడీపీ నేత. ఇప్పుడాయన బీజేపీలో వున్నారు. ‘ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం.’ అని కేంద్రం ఇప్పటికే చాలాసార్లు చెప్పేసింది. హోదా స్థానంలో ‘సాయం’ అందిస్తున్నట్లు ప్రకటించేస్తోంది కూడా.

ఈ తరుణంలో కేంద్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ లేఖ రాయడం వెనుక ఆంతర్యమేంటి.? అంటే, రాష్ట్రంలో మళ్ళీ ప్రత్యేక హోదా డిమాండ్‌ ఊపందుకుంటుండడం వల్లేనని అర్థమవుతోంది. ప్రత్యేక హోదా ఉద్యమ నినాదం ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి, టీడీపీ నుంచి గట్టిగా విన్పించిన విషయం విదితమే. ఆ తర్వాత అంతా ఆ విషయాన్ని మర్చిపోయారు. మరీ ముఖ్యంగా వైసీపీ ఈ విషయాన్ని డైల్యూట్‌ చేసేసింది. మళ్ళీ ఏమయ్యిందో, జగన్‌ నోట ప్రత్యేక హోదా నినాదం వస్తోంది.

రాష్ట్రంలో ఇటీవలి కాలంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో జగన్‌, ఈ ‘హోదా అస్త్రాన్ని’ ప్రయోగిస్తున్నారని అనుకోవాలేమో. మూడు రాజధానుల వ్యవహారం సహా, రాష్ట్రంలో ఇటీవలి కాలంలో ప్రభుత్వమే తీవ్రస్థాయిలో అలజడి సృష్టించింది. ఆ అలజడిని డైవర్ట్‌ చేయాలంటే, ఇంకో కీలక అంశం తెరపైకి రావాలి. అదే ప్రత్యేక హోదా. లేఖతో వ్యవహారం ఆగదనీ, ముందు ముందు వైసీపీ నుంచి ప్రత్యేక హోదా పోరాటాలు చూడబోతున్నారని వైసీపీ వర్గాలు అంటున్నాయి. దానర్థం, వైసీపీకి ప్రత్యేక హోదా మీద ఆశ వుందని కాదు.. తమ పాలన పట్ల పెరిగిన ప్రజా వ్యతిరేకత నేపథ్యంలో ప్రజల దృష్టిని మళ్ళించడానికే ఈ హోదా నాటకం అధికార పార్టీ ఆడబోతోందన్నమాట.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఎక్కువ చదివినవి

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...