ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు వ్యతిరేకంగా ప్రచారం సాగించిన మీడియా సంస్థలపై ఏదో ఒక విధంగా కక్ష సాధిస్తారని అందరూ ఊహించారు. అనుకున్నట్టుగానే ఏబీఎన్, టీవీ5 ఛానళ్లపై అనధికార వేటు వేశారు. అయితే, సంబంధిత రెగ్యులేటరీలు ఈ విషయంలో సర్కారు వైఖరిని ఎండగట్టాయి. తాజాగా రెండు రోజుల్లో ఏపీలో ఏబీఎన్ ప్రసారాలను పునరుద్ధరించాలని ఏపీ ఫైబర్ నెట్ కు స్పష్టంచేసింది. దీంతో చేసేది లేక ఈనెల 22లోపు ప్రసారాలు పునరుద్ధరిస్తామని ఫైబర్ నెట్ విన్నవించింది.
ఇదిలా ఉంటే, ఆంధ్రజ్యోతి యాజమాన్యం ఆమోదా పబ్లికేషన్స్ కి గత ప్రభుత్వం విశాఖపట్నంలో ఎకరన్నర భూమిని కేటాయిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను జగన్ ప్రభుత్వం రద్దు చేసింది. ఇందుకు సంబంధించి బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు గుప్పిస్తున్న ఆంధ్రజ్యోతిపై కఠినంగా వ్యవహరించాలనే ఉద్దేశంతోనే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.
అయితే, దీనిపై ఆంధ్రజ్యోతి యాజమాన్యం ధీటుగా స్పందించింది. ఆ భూమిని తమకు చంద్రబాబు సర్కారు అప్పనంగా కేటాయించింది కాదని, 1986లో నాటి టీడీపీ ప్రభుత్వమే తమకు భూమి ఇచ్చిందని వివరించింది. అప్పట్లో పరదేశిపాలెంలో ఎకరా భూమి రూ.10వేల చొప్పున ఒకటిన్నర ఎకరం భూమిని కేటాయించింది. తర్వాత జాతీయ రహదారి విస్తరణ కోసం ఎకరం భూమిని వెనక్కి తీసుకున్నారని, అందుకు ప్రతిఫలంగా చంద్రబాబు ప్రభుత్వం ఆ భూమిని ఇచ్చిందని ఆమోదా పబ్లికేషన్స్ పేర్కొంది.
ఇందుకోసం తాము రూ.50.05 లక్షలు చెల్లించామని వెల్లడించింది. వాస్తవాలన్నీ ఇలా ఉంటే, తమకు చంద్రబాబు అప్పనంగా భూమి కేటాయించారని పేర్కొనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపింది. కాగా, కేబినెట్ లో ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ వ్యవహారంపై తీవ్రంగానే చర్చ జరిగినట్టు సమాచారం. సర్కారుకు వ్యతిరేకంగా కథనాలు రాస్తోందని ఒకరిద్దరు మంత్రులు మండిపడినట్టు తెలిసింది. ఇకపై ఆధారాలు లేకుండా ఆ పత్రిక, ఛానెల్ లో కథనాలు వస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ సూచించినట్టు సమాచారం.
334533 675510I recognize there is a superb deal of spam on this site. Do you need aid cleaning them up? I may help in between courses! 897819
993883 297877I always was interested in this topic and nonetheless am, regards for posting . 227333