అసెంబ్లీలో విపక్షాల్ని ఇరకాటంలో పడేయడం అధికార పార్టీకి కొత్తేమీ కాదు. అక్కడ ‘పై చేయి’ సాధించడమే తమ పాలనకు నిదర్శనమని అధికార పక్షం అనుకుంటే.. గతంలో చాలామంది పాలకులకి ఆ తర్వాత ఎదురైన ‘చేదు’ పరిస్థితులు ముందు ముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డికీ ఎదురవుతాయన్నది నిర్వివాదాంశం.
అత్యాచారం కేసుల్లో సత్వర మరణ శిక్ష.. అంటూ ‘దిశ’ పేరుతో కొత్త చట్టానికి వైఎస్ జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం విదితమే. ఆహ్వానించదగ్గ పరిణామమే ఇది. ఈ చట్టం దిశగా తొలి అడుగు వేసిన ముఖ్యమంత్రికి వైసీపీకి చెందిన మహిళా ప్రజా ప్రతినిథులు కృతజ్ఞతలు తెలిపారు. రాఖీలు కూడా కట్టారు.
అయితే, రాష్ట్రంలో సుగాలి ప్రీతి అనే బాలికపై ‘అత్యాచారం – హత్య’ ఘటనపై ప్రభుత్వం ఇప్పటిదాకా పెదవి విప్పడంలేదు. చంద్రబాబు హయాంలో ఘటన జరిగితే, అప్పటినుంచీ బాధిత కుటుంబం ప్రభుత్వాల చుట్టూ తిరుగుతూనే వుంది. ప్రజా సంఘాలు ఉద్యమిస్తూనే వున్నాయి.. కానీ, బాధిత కుటుంబానికి ఇప్పటిదాకా న్యాయం జరగలేదు.
‘దిశ’ చట్టానికి సంబంధించి అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో అయినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులకు భరోసా ఇవ్వలేకపోయారు. మరోపక్క, అధికార పార్టీలోని కొందరు ముఖ్య నేతలపై ఈ తరహా కేసులున్నాయి. వాటిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి స్పందించాల్సి వుంది.
ఇక, ఎప్పుడో వైఎస్ హయాంలో వెలుగు చూసిన అయేషా మీరా హత్య కేసుకి సంబంధించి సీబీఐ విచారణ జరుగుతోంది.. రీ-పోస్ట్మార్టమ్ దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ ఘటనపైనా ప్రభుత్వం స్పందించాల్సి వుంది. చెప్పుకుంటూ పోతే, ఇలాంటి కేసులు పదుల సంఖ్యలో కాదు.. వందల సంఖ్యలో వుంటాయన్నది నిర్వివాదాంశం. చట్టం చేసి, రాఖీలు కట్టించుకుంటే బాధితులకు న్యాయం జరిగిపోయినట్లా.?
300056 7059I want looking at and I believe this internet site got some really beneficial stuff on it! . 301176
2694 822719Theres noticeably a bundle to uncover out about this. I assume you created certain great points in features also. 426214
356663 832723I visited plenty of web site but I conceive this one holds something extra in it in it 5916
738011 481337Some genuinely good information , Gladiola I observed this. 382862