గత ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే అతి విశ్వాసానికి పోయి బొక్కబోర్లా పడ్డ జగన్ మోహన్రెడ్డి.. ఈసారి కూడా అదేవిశ్వాసంతో ఉంటే చాలా కష్టమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో చాలామటుకు జగన్ తమ ఎమ్మెల్యే అభ్యర్థులకు డబ్బుతో అవసరం లేదు.. కేవలం నన్నుచూసి ఓటేస్తారనే అతి విశ్వాసం చివరికి ప్రతిపక్షానికి పరిమితం చేసింది.
ప్రసుత్తం ప్రభుత్వ వ్యతిరేక ఓటు, అటు కాపుల ఓట్లకు సంబంధించిన చీలిక కారణంగా తమకు లాభం చేకూరుస్తుందనే అశలు వైకాపాలో ఉన్నాయి. దానికి కారణం లేకపోలేదు. గత ఎన్నికల్లో కాపు రిజర్వేషన్, పవన్కళ్యాణ్ చేతులు కలపడంతో దాదాపు 98శాతం కాపు ఓట్లు తెలుగుదేశానికి అనుకూలంగా పడ్డాయి. దానితోనే గోదావరి జిల్లాల్లో గంపగుత్తగా సీట్లను తెచ్చుకుని అధికారం చేపట్టగలిగింది. ఇప్పుడు పవన్కళ్యాణ్ వేరు కుంపటి కారణంగా ఆ ఓట్లు ఎలాగు టీడీపీకి పడవు.. దానికితోడు కాపు రిజర్వేషన్లు కూడా అమలు చేయకపోవడంతో ఆ వర్గం చీలిక ఓట్లు తమకు లాభిస్తాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం కొన్ని సర్వే ఫలితాలు బయటికి వచ్చాయి. దాని ప్రకారం జగన్ పూర్తి మెజారిటీతో అధికారం చేపట్టనున్నారని తెలుస్తోంది. సర్వేలను పూర్తిగా నమ్మడానికి వీలులేదు. ఎందుకంటే గత కొంతకాలంగా చాలా రాష్ట్రాల్లో జరిపిన సర్వేల్లో బొక్కబొర్లా పడ్డ సందర్భాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో కూడా వైసీపీ ఖచ్చితంగా గెలుస్తుందని దాదాపు అన్ని సర్వేలు చెప్పాయి. కానీ ఫలితాలు వచ్చేనాటికి పూర్తిగా రివర్స్ అయ్యాయి. చంద్రబాబు చాణక్యం ముందు ఎవరూ పనికిరారు అనేది మరోసారి స్పష్టం అయ్యింది.
ప్రస్తుత సర్వేల ప్రకారం ఓటు, సీట్లశాతం ఇలా ఉన్నాయి…
ఇండియా టీవీ, సీఎన్ఎక్స్, టైమ్స్ నౌ ఫలితాల ప్రకారం వైసీపీకి 20 ఎంపీ సీట్లు, టీడీపీకి 5 ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. అలాగే సీట్ల విషయానికి వస్తే… వీడీపీ అసోషియేషన్ వైసీపీకి 106 నుంచి 108 సీట్లు, సీఎస్డీఎస్ – లోక్నీతి 108 నుంచి 124 సీట్లు. సీపీఎస్ 121నుంచి 130 సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశాయి. అలాగే టీడీపీకి వరుసగా.. వీడీపీ అసోషియేషన్ 54 నుంచి 68, సీఎస్డీఎస్ – లోక్నీతి 41 నుంచి 57, సీపీఎస్ 45 నుంచి 84 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పాయి. ఇక జనసేనకు కూడా తమ అంచనాలు ఇచ్చాయి. వరుసగా జనసేన సీట్ల సంఖ్యను చూస్తే.. వీడీపీ అసోషియేషన్ 1 నుంచి 3, సీఎస్డీఎస్ – లోక్నీతి 5నుంచి 10 సీట్లు, సీపీఎస్ 1 నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశాయి. ఓట్ల శాతం కూడా చాలా వ్యత్యాసం కనిపిస్తోంది.. వైసీపీకి 48.1, టీడీపీకి 40.01, జనసేనకు 9.80 వరకూ వచ్చే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
వీటిని బట్టి పూర్తిగా అంచనాకు రాలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఓటర్ల మనోగతాన్ని ఎవ్వరూ కూడా పసిగట్టలేకపోతున్నారని… వారు బయటికి ఒకటి చెప్పినా లోపల మాత్రం ఇప్పటికే ఎవరికి ఓటువేయాలో నిర్ణయించుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చూడాలి మరి ఏమి జరుగుతుంతో.!
622907 252915Wohh just what I was seeking for, appreciate it for putting up. 49749
958859 271715dog grooming will be the specialty of my sister, she actually loves grooming every dog in our house 210464