Switch to English

సర్వేలను నమ్ముకుంటే అంతే జగన్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

గత ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే అతి విశ్వాసానికి పోయి బొక్కబోర్లా పడ్డ జగన్‌ మోహన్‌రెడ్డి.. ఈసారి కూడా అదేవిశ్వాసంతో ఉంటే చాలా కష్టమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో చాలామటుకు జగన్‌ తమ ఎమ్మెల్యే అభ్యర్థులకు డబ్బుతో అవసరం లేదు.. కేవలం నన్నుచూసి ఓటేస్తారనే అతి విశ్వాసం చివరికి ప్రతిపక్షానికి పరిమితం చేసింది.

ప్రసుత్తం ప్రభుత్వ వ్యతిరేక ఓటు, అటు కాపుల ఓట్లకు సంబంధించిన చీలిక కారణంగా తమకు లాభం చేకూరుస్తుందనే అశలు వైకాపాలో ఉన్నాయి. దానికి కారణం లేకపోలేదు. గత ఎన్నికల్లో కాపు రిజర్వేషన్‌, పవన్‌కళ్యాణ్‌ చేతులు కలపడంతో దాదాపు 98శాతం కాపు ఓట్లు తెలుగుదేశానికి అనుకూలంగా పడ్డాయి. దానితోనే గోదావరి జిల్లాల్లో గంపగుత్తగా సీట్లను తెచ్చుకుని అధికారం చేపట్టగలిగింది. ఇప్పుడు పవన్‌కళ్యాణ్‌ వేరు కుంపటి కారణంగా ఆ ఓట్లు ఎలాగు టీడీపీకి పడవు.. దానికితోడు కాపు రిజర్వేషన్లు కూడా అమలు చేయకపోవడంతో ఆ వర్గం చీలిక ఓట్లు తమకు లాభిస్తాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం కొన్ని సర్వే ఫలితాలు బయటికి వచ్చాయి. దాని ప్రకారం జగన్‌ పూర్తి మెజారిటీతో అధికారం చేపట్టనున్నారని తెలుస్తోంది. సర్వేలను పూర్తిగా నమ్మడానికి వీలులేదు. ఎందుకంటే గత కొంతకాలంగా చాలా రాష్ట్రాల్లో జరిపిన సర్వేల్లో బొక్కబొర్లా పడ్డ సందర్భాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో కూడా వైసీపీ ఖచ్చితంగా గెలుస్తుందని దాదాపు అన్ని సర్వేలు చెప్పాయి. కానీ ఫలితాలు వచ్చేనాటికి పూర్తిగా రివర్స్‌ అయ్యాయి. చంద్రబాబు చాణక్యం ముందు ఎవరూ పనికిరారు అనేది మరోసారి స్పష్టం అయ్యింది.

ప్రస్తుత సర్వేల ప్రకారం ఓటు, సీట్లశాతం ఇలా ఉన్నాయి…

ఇండియా టీవీ, సీఎన్‌ఎక్స్‌, టైమ్స్‌ నౌ ఫలితాల ప్రకారం వైసీపీకి 20 ఎంపీ సీట్లు, టీడీపీకి 5 ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. అలాగే సీట్ల విషయానికి వస్తే… వీడీపీ అసోషియేషన్‌ వైసీపీకి 106 నుంచి 108 సీట్లు, సీఎస్‌డీఎస్‌ – లోక్‌నీతి 108 నుంచి 124 సీట్లు. సీపీఎస్‌ 121నుంచి 130 సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశాయి. అలాగే టీడీపీకి వరుసగా.. వీడీపీ అసోషియేషన్‌ 54 నుంచి 68, సీఎస్‌డీఎస్‌ – లోక్‌నీతి 41 నుంచి 57, సీపీఎస్‌ 45 నుంచి 84 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పాయి. ఇక జనసేనకు కూడా తమ అంచనాలు ఇచ్చాయి. వరుసగా జనసేన సీట్ల సంఖ్యను చూస్తే.. వీడీపీ అసోషియేషన్‌ 1 నుంచి 3, సీఎస్‌డీఎస్‌ – లోక్‌నీతి 5నుంచి 10 సీట్లు, సీపీఎస్‌ 1 నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశాయి. ఓట్ల శాతం కూడా చాలా వ్యత్యాసం కనిపిస్తోంది.. వైసీపీకి 48.1, టీడీపీకి 40.01, జనసేనకు 9.80 వరకూ వచ్చే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

వీటిని బట్టి పూర్తిగా అంచనాకు రాలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఓటర్ల మనోగతాన్ని ఎవ్వరూ కూడా పసిగట్టలేకపోతున్నారని… వారు బయటికి ఒకటి చెప్పినా లోపల మాత్రం ఇప్పటికే ఎవరికి ఓటువేయాలో నిర్ణయించుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చూడాలి మరి ఏమి జరుగుతుంతో.!

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree). కమలేష్ కుమార్ నిర్మాత. మే24న విడుదలవుతోన్న...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...