Switch to English

జగన్ ది అతి విశ్వాసమా.. ఆత్మ విశ్వాసమా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఏ విషయంలోనైనా ఆత్మ విశ్వాసం ఉండొచ్చు. కానీ అతి విశ్వాసం పనికిరాదు. అతి విశ్వాసంతో ఒక్కోసారి బొక్కబోర్లా పడి తల బొప్పి కట్టించుకునే అవకాశం ఉంటుంది. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం ఆత్మ విశ్వాసంతో ఉన్నారా లేక గత ఎన్నికల తరహాలోనే అతి విశ్వాసంతో ఉన్నారా అనేది తెలియడంలేదు. ఏపీలో ఎన్నికలు ముగిశాయి. గెలుపుపై ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. క్షేత్ర స్థాయి పరిస్థితులు, పోలింగ్ సరళిని బట్టి వైఎస్సార్ సీపీ తమదే గెలుపు అని ధీమాగా ఉంది.

మరోవైపు ఈవీఎంల మొరాయింపు, ఈసీ వ్యవహార శైలిపై చంద్రబాబు ఆందోళన చేస్తుండటం కూడా వైఎస్సార్ సీపీ గెలుపు తమదేనని అంచనా వేసుకుంటోంది. పోలింగ్ తర్వాత సైలెంట్ అయిన చంద్రబాబు, టీడీపీ నేతలు మౌనం వీడారు. ఈసీపై యుద్ధం ప్రకటించి, ఢిల్లీ బాట పట్టారు. గెలుపు తమదేనని అంటున్నారు. సాయంత్రం వేళ మహిళలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో బారులు తీరి ఓట్లేశారని.. అవన్నీ తెలుగుదేశానికేనని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు.

మరోవైపు వైఎస్సార్ సీపీ అధినేత జగన్ మాత్రం పోలింగ్ పూర్తి అయినప్పటి నుంచి చాలా సంయమనంతో ఉన్నారు. పోలింగ్ రోజు రాత్రి 8.30 గంటల సమయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. గెలుపు తమదేనని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ భారీ మెజార్టీతో గెలవబోతోందని ధీమా వ్యక్తంచేశారు. ఇంతవరకు బాగానే ఉంది. తదుపరి జగన్ చర్యలు ఆయనలోని అతి విశ్వాసానికి నిదర్శనంగా ఉన్నాయి. ఈ చర్యల్లో ఆయన ప్రమేయం లేకపోయినప్పటికీ, జనాల్లో మాత్రం ప్రతికూల భావనలు కలుగుతున్నాయి.

ఈ ఎన్నికల్లో రాజకీయ వ్యూహాలు అందించేందుకు ప్రశాంత్ కిషోర్ అనే రాజకీయ సలహాదారును జగన్ నియమించుకున్న సంగతి తెలిసిందే. పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఆయన తన సిబ్బందితో సహా స్వస్థలానికి పయనమయ్యారు. ఈ నేపథ్యంలో వారికి వీడ్కోలు పలికేందుకు జగన్.. ప్రశాంత్ కిషోర్ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా అక్కడున్నవారంతా సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేశారు. ఇందుకు జగన్ చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు. తర్వాత ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ.. ఏపీకి బెస్ట్ సీఎంగా ఉండాలని జగన్ కు సూచించారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. 2024లో కూడా గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలని అభిప్రాయపడ్డారు. ఇంకా ఏపీ అసెంబ్లీ ఫలితాలు విడుదల కాలేదు. అయినప్పటికీ, జగన్ ఏకంగా 2024 గురించి మాట్లాడారు. మరోవైపు ‘వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి’ అని తయారుచేయించిన నేమ్ ప్లేట్ సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. అభిమానులు ఎవరో అత్యుత్సాహంతో తయారుచేయించిన ఆ నేమ్ ప్లేట్ ఫొటో సోషల్ మీడియాలో రావడంతో ప్రత్యర్థి వర్గాలు విరుచుకుపడుతున్నాయి. ఇంకా ఫలితాలు వెలువడక ముందే ఇదేం చోద్యమని విమర్శలు గుప్పిస్తున్నాయి.

గత ఎన్నికల్లో కూడా అతి విశ్వాసంతోనే జగన్ దెబ్బ తిన్నారని గుర్తుచేస్తున్నాయి. 2014లో గెలుపు తమదేనని గుడ్డి నమ్మకం పెట్టుకున్న జగన్.. మిగిలిన విషయాలు అంతగా పట్టించుకోలేదు. అప్పటివరకు జగన్ వైపు ఉన్న వేవ్ కాస్తా చివరి రెండు నెలల్లో ఒక్కసారిగా చంద్రబాబుకు అనుకూలంగా మారిపోయింది. అది గమనించని జగన్.. విజయం తమదేనని ధీమాతో ఉండి భంగపడ్డారు. ఈసారి పోల్ మేనేజ్ మెంట్ వంటి వాటిలో పూర్తిగా విజయం సాధించిన ఆయన.. మరోసారి అతి విశ్వాసం కనబర్చకుండా మామూలుగా ఉంటే బాగుంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఫలితాలు వెలువడే వరకు సంయమనంతో తెలివిగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...