Switch to English

ఏపీ డీజీపీ ఠాకూర్ వెనక్కి?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ వెనక్కి వెళ్లిపోవాలని భావిస్తున్నారా? డీజీపీ పదవి వీడి తిరిగి కేంద్ర సర్వీసులకు వెళ్లిపోవాలని అనుకుంటున్నారా? ఇందుకు కేంద్రానికి దరఖాస్తు చేసుకున్నారా? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. డీజీపీగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని ఠాకూర్ ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. పలు సందర్భాల్లో ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ నేతలు డీజీపీపై తీవ్ర ఆరోపణలు చేశారు.

ముఖ్యంగా వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం కేసులో డీజీపీ ఠాకూర్ వ్యవహరించిన శైలిపై ఆ పార్టీ నేతలు విరుచుకుపడ్డారు. దర్యాప్తు జరపకుండానే నిందితుడు వైఎస్సార్ సీపీకి చెందిన వ్యక్తి అని మీడియా ముందు ప్రకటించారని, ఇదంతా చూస్తుంటే ఈ కేసును వారు తీవ్రంగా ప్రభావితం చేస్తున్నారని అర్థమవుతోందని వైఎస్సార్ సీపీ నేతలు ఆరోపణలు చేశారు. అవకాశం ఉన్న ప్రతిసారీ డీజీపీపై విమర్శలు చేయడానికి వైసీపీ నేతలు ప్రాధాన్యం ఇచ్చారు.

అంతేకాకుండా ఎన్నికల సమయంలో ఆయన్ను డీజీపీగా తప్పించాలని పలుమార్లు కేంద్ర ఎన్నికల సంఘానికి విన్నవించారు. ఇంటెలిజెన్స్ డీజీ, పలువురు ఎస్పీలను బదిలీ చేసిన ఈసీ.. డీజీపీ ఠాకూర్ విషయంలో మాత్రం స్పందించలేదు. ఈ విషయంలో వైసీపీ నేతలు చివరి వరకు ప్రయత్నించినప్పటికీ, సానుకూల ఫలితం రాలేదు. ఫలితంగా ఎన్నికల వేళ డీజీపీగా ఠాకూర్ కొనసాగారు.

అయితే, సీఎస్ పునేఠా స్థానంలో ఎల్వీ సుబ్రమణ్యాన్ని నియమిస్తూ ఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది. పోలింగ్ రోజున ఆయన డీజీపీ కార్యాలయానికి వెళ్లి అక్కడే ఉండి ఎన్నికలు జరుగుతున్న సరళిని పర్యవేక్షించారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు అభ్యంతరం కూడా తెలిపారు. మొత్తమ్మీద పోలింగ్ ముగిసిన రెండు రోజుల తర్వాత డీజీపీ ఠాకూర్ ఏపీని వీడి తిరిగి కేంద్రానికి వెళ్లిపోవాలని భావిస్తున్నారని, ఇందుకోసం కేంద్రానికి దరఖాస్తు చేసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. పోలింగ్ సరళి చూసిన తర్వాత, తెలుగుదేశం పార్టీ విజయావకాశాలు లేవనే నిర్ణయానికి రావడంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.

టీడీపీ గెలిచే అవకాశం ఉంటే ఇక్కడే కొనసాగేవారని, పోలింగ్ అనంతర పరిణామాలు చేసిన ఆయన.. ఇక టీడీపీ గెలిచే అవకాశం లేదని నిర్ణయానికి వచ్చారని, అందుకే తిరిగి వెనక్కి వెళ్లిపోవాలని భావిస్తున్నారని చెబుతున్నారు. టీడీపీ ఓడిపోయి, వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే, ఆ ప్రభుత్వంలో ఆయన పనిచేయడానికి ఇబ్బంది పడతారని, ఇన్నాళ్లూ తనను విమర్శించిన వారి ఆధ్వర్యంలో పనిచేయడం కష్టంగా ఉంటుందని, అందుకే ఆయన ఏపీని వీడాలని భావిస్తున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరి నిజంగానే ఆయన కేంద్రానికి దరఖాస్తు చేసుకున్నారా లేక ఇవన్నీ కేవలం ఊహాగానాలేనా అన్న విషయాలు తేలాలంటే మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉంది.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...