ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. వంగి వంగి దండాలు పెడుతున్నారు ప్రధాని నరేంద్ర మోడీకి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ మాత్రం, ప్రధాని మోడీని అస్సలు లెక్క చేయడంలేదు.
మోడీకి వైఎస్ జగన్ బానిసత్వం చేస్తున్నారన్నది ఏపీలో ప్రధానంగా వినిపిస్తోన్న విమర్శ. మోడీ విషయంలో కేసీయార్ తప్పు చేస్తున్నారన్నది తెలంగాణలో కొంతమంది నుంచి వినిపిస్తోన్న వాదన. ఏది నిజం.? అన్నది మళ్ళీ వేరే చర్చ.
కేసీయార్, ప్రధాని మీద విమర్శలు చేయడం వల్ల.. ప్రధానిని కేసీయార్ పట్టించుకోకపోవడం వల్ల తెలంగాణకు అదనంగా వచ్చిన నష్టమేమీ లేదు. ప్రధాని విషయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అతి వినయం ప్రదర్శించడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అదనంగా వచ్చిన లాభమూ ఏమీ లేదు.
నిజానికి, తెలంగాణ కంటే ఎక్కువగా ఏపీకి ప్రధాని మోడీ చాలా చాలా చేయాల్సి వుంది. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, రైల్వే జోన్, దుగరాజపట్నం పోర్టు, కడప స్టీలు ప్లాంటు.. ఇవన్నీ విభజన హామీలు. వాటితోపాటే రాజధాని, వెనుకబడిన జిల్లాలకు కేంద్ర సాయం.. ఇవన్నీ చేయాల్సి వుంది.
పైన చెప్పుకున్నవాటిల్లో ఏ విషయంలోనూ కేంద్రం బాధ్యతాయుతంగా వ్యవహరించడంలేదు. అందుకే కదా, గతంలో వైసీపీ ఎంపీలు రాజీనామా చేసింది. కానీ, ఇప్పుడేం చేస్తోంది వైసీపీ.? అధికారంలోకి వచ్చాక, కేంద్రానికి వంగి వంగి దండాలెడుతోంది వైసీపీ. ఓ బహిరంగ సభ ద్వారా ప్రధానికి రాష్ట్ర సమస్యలపై ముఖ్యమంత్రి విన్నవించుకుంటే, కనీసం వాటిపై ప్రధాని స్పందించలేదు.
తెలంగాణ విషయానికొస్తే, కేసీయార్ని ప్రధాని నరేంద్ర మోడీ తిట్టిపోశారు. కేవలం దీనికోసమే తెలంగాణకు ప్రధాని వచ్చినట్లుగా తయారైంది వ్యవహారం. తెలంగాణ సమాజం తరఫున కేంద్రం ముందు పలు ప్రశ్నలుంచారు కేసీయార్ గతంలోనే. అందులో ఏ ఒక్కదానికీ ప్రధాని సమాధానం చెప్పలేదు.. చెప్పరు కూడా.!
మొత్తమ్మీద, తెలుగు రాష్ట్రాలకు సమన్యాయం చేయాల్సిన కేంద్రం, సమ అన్యాయం చేస్తోంది. ప్రశ్నించలేని బానిసత్వం ఒక వైపు.. ప్రశ్నించినా పనులు జరగని పరిస్థితి ఇంకో వైపు. ఇద్దరూ కలిస్తే తప్ప, కేంద్రాన్ని ఇంకాస్త సమర్థవంతంగా ప్రశ్నించే అవకాశం వుండదు.
Hi mates, good paragraph and good arguments
commented at this place, I am truly enjoying by these.
381603 467800Spot up for this write-up, I seriously believe this web site needs a whole lot a lot more consideration. Ill apt to be once much more to learn additional, appreciate your that info. 845493