తెలంగాణా రాజకీయాలతో తమకేంటి సంబంధమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేతులు దులుపుకుంటే, అది హాస్యాస్పదమే అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో పార్టీ ఫిరాయింపులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంత గగ్గోలు పెట్టిందో చూశాం. కానీ, తెలంగాణాలో ముగ్గురు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి, టీఆర్ఎస్లో చేరితే వైఎస్ జగన్ సహా వైసీపీ నేతలు ఎవరికీ గొంతు పెగలలేదు. వైసీపీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటికీ టీఆర్ఎస్లోనే ఉన్నారు. అయినా ఫెడరల్ ఫ్రంట్ కోసం టీఆర్ఎస్తో వైఎస్ జగన్ చర్చలు జరిపారు. అంటే దానర్ధం టీఆర్ఎస్, వైసీపీ విలువల్ని పక్కన పెట్టి లోపాయకారి అవగాహనతో పని చేస్తున్నట్లే కదా.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుదామనుకుంటున్న వైఎస్ జగన్ ఇప్పటికీ హైద్రాబాద్ నుండే ఏపీలో రాజకీయాలు చేస్తున్నారు. దాన్ని పూర్తిగా తప్పు పట్టలేం. ఎందుకంటే ఇంకో ఐదేళ్లు హైద్రాబాద్, ఆంధ్రప్రదేశ్కి కూడా ఉమ్మడి రాజధాని. ఈ నేపథ్యంలో హైద్రాబాద్పై ఆంధ్రప్రదేశ్కి ఇంకా హక్కు ఉన్నట్లే లెక్క. కాబట్టి, జగన్ హైద్రాబాద్లో ఉండడం, ఇక్కడి నుండి రాజకీయాలు చేయడం పూర్తిగా తప్పు పట్టే విషయం కాదు. అయితే ఓ రాజకీయ నాయకుడిగా 20 మందికి పైగా విద్యార్ధులు బలవన్మరణాలకు పాల్పడితే, ఇంతటి దారుణ పరిస్థితిపై స్పందించాలి కదా.
వైఎస్ జగన్, విదేశీ టూర్లో ఉన్నారు కాబట్టి ఆయనకు నీడలా వ్యవహరిస్తున్న విజయ్ సాయి రెడ్డి అయినా తెలంగాణాలో విద్యార్ధుల ఆత్మహత్యలపై స్పందించి ఉండాలి. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటున్న విజయ సాయిరెడ్డికి తెలంగాణాలో పరస్థితులు తెలియవని ఎలా అనుకోగలం.? తెలిసినా, మిన్నకుండి పోవాలి. కేసీఆర్ని ప్రశ్నిస్తే పరిస్థితులు తేడాగా మారిపోతాయి. ఆ భయంతోనే విజయ సాయిరెడ్డి కావచ్చు, మరో వైసీపీ నేత కావచ్చు సైలెంట్ అయిపోయారు. ఇప్పటికీ తెలంగాణాలో వైఎస్సార్ సీపీ తరపున కొందరు నేతలు హల్చల్ చేస్తున్నారు కాబట్టి, తెలంగాణా రాజకీయాలపై వైసీపీ కూడా పెదవి విప్పాల్సిందే.
ఆంధ్రప్రదేశ్లో చీమ చిటుక్కుమంటే, ఆ తప్పంతా చంద్రబాబుదేనని గగ్గోలు పెట్టే వైసీపీ, టీఆర్ఎస్ విషయంలో ఇంత మౌనం దాల్చడం చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. రాజకీయ పార్టీగా వైసీపీ బాధ్యతాయుతంగా ప్రవర్తించడం లేదనీ, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకంలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం, ఆంధ్రప్రదేశ్ని అధికారం కోసమే అన్నట్లు వైసీపీ వాడుకుంటోందనీ, కొందరు రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని కుండ బద్దలుకొడుతున్నారు. జనసేన పార్టీ తెలంగాణా విద్యార్ధుల బలవన్మరణాలపై స్పందించింది. ప్రత్యక్షంగా విద్యార్ధుల కోసం పోరుబాట పట్టింది. తెలంగానా ప్రభుత్వాన్ని నిలదీసింది.
ఉన్నంతలో తెలుగుదేశం పార్టీ కూడా స్పందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణాలో విద్యార్ధుల బలవన్మరణాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆరు దశాబ్ధాలకు పైగా తెలుగు ప్రజలంతా ఒకే రాష్ట్రంగా కలిసి మెలిసి ఉన్నాం. రాష్ట్రాలుగా విడిపోయాం తప్ప ప్రజలుగా కాదు. పొరుగున ఉన్న మన బిడ్డలు, మన సోదరులు, మన సోదరీ మణులు కష్టాన్ని ఎదుర్కొంటోంటే కనీస సానుభూతి ప్రకటించాలి అనే ఇంగితం కూడా వైఎస్సార్సీపీలో కనిపించడం లేదు. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని సోషల్ మీడియా వేదికగా తెలుగు ప్రజలు ఇదే విషయమై ప్రశ్నిస్తున్నారు. కానీ స్పందించే ధైర్యం ఆయనకెక్కడిది.?
195402 354079Typically I dont read this kind of stuff, but this was actually fascinating! 639497
475510 40508Excellent day! This post could not be written any greater! Reading this post reminds me of my previous room mate! He always kept chatting about this. I will forward this write-up to him. Fairly certain he will have a excellent read. Thanks for sharing! 824807
11721 400534This is the very first time I frequented your web page and up to now? I surprised with the analysis you made to make this particular post extraordinary. 324821
700284 590177Its great as your other content material : D, appreciate it for posting . 944719
401054 62581I genuinely treasure your function , Excellent post. 502226