Switch to English

విజయసాయిరెడ్డికి ఆ ధైర్యం ఉందా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

తెలంగాణా రాజకీయాలతో తమకేంటి సంబంధమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చేతులు దులుపుకుంటే, అది హాస్యాస్పదమే అవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ ఫిరాయింపులపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంత గగ్గోలు పెట్టిందో చూశాం. కానీ, తెలంగాణాలో ముగ్గురు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడి, టీఆర్‌ఎస్‌లో చేరితే వైఎస్‌ జగన్‌ సహా వైసీపీ నేతలు ఎవరికీ గొంతు పెగలలేదు. వైసీపీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటికీ టీఆర్‌ఎస్‌లోనే ఉన్నారు. అయినా ఫెడరల్‌ ఫ్రంట్‌ కోసం టీఆర్‌ఎస్‌తో వైఎస్‌ జగన్‌ చర్చలు జరిపారు. అంటే దానర్ధం టీఆర్‌ఎస్‌, వైసీపీ విలువల్ని పక్కన పెట్టి లోపాయకారి అవగాహనతో పని చేస్తున్నట్లే కదా.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుదామనుకుంటున్న వైఎస్‌ జగన్‌ ఇప్పటికీ హైద్రాబాద్‌ నుండే ఏపీలో రాజకీయాలు చేస్తున్నారు. దాన్ని పూర్తిగా తప్పు పట్టలేం. ఎందుకంటే ఇంకో ఐదేళ్లు హైద్రాబాద్‌, ఆంధ్రప్రదేశ్‌కి కూడా ఉమ్మడి రాజధాని. ఈ నేపథ్యంలో హైద్రాబాద్‌పై ఆంధ్రప్రదేశ్‌కి ఇంకా హక్కు ఉన్నట్లే లెక్క. కాబట్టి, జగన్‌ హైద్రాబాద్‌లో ఉండడం, ఇక్కడి నుండి రాజకీయాలు చేయడం పూర్తిగా తప్పు పట్టే విషయం కాదు. అయితే ఓ రాజకీయ నాయకుడిగా 20 మందికి పైగా విద్యార్ధులు బలవన్మరణాలకు పాల్పడితే, ఇంతటి దారుణ పరిస్థితిపై స్పందించాలి కదా.

వైఎస్‌ జగన్‌, విదేశీ టూర్‌లో ఉన్నారు కాబట్టి ఆయనకు నీడలా వ్యవహరిస్తున్న విజయ్‌ సాయి రెడ్డి అయినా తెలంగాణాలో విద్యార్ధుల ఆత్మహత్యలపై స్పందించి ఉండాలి. సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్న విజయ సాయిరెడ్డికి తెలంగాణాలో పరస్థితులు తెలియవని ఎలా అనుకోగలం.? తెలిసినా, మిన్నకుండి పోవాలి. కేసీఆర్‌ని ప్రశ్నిస్తే పరిస్థితులు తేడాగా మారిపోతాయి. ఆ భయంతోనే విజయ సాయిరెడ్డి కావచ్చు, మరో వైసీపీ నేత కావచ్చు సైలెంట్‌ అయిపోయారు. ఇప్పటికీ తెలంగాణాలో వైఎస్సార్‌ సీపీ తరపున కొందరు నేతలు హల్‌చల్‌ చేస్తున్నారు కాబట్టి, తెలంగాణా రాజకీయాలపై వైసీపీ కూడా పెదవి విప్పాల్సిందే.

ఆంధ్రప్రదేశ్‌లో చీమ చిటుక్కుమంటే, ఆ తప్పంతా చంద్రబాబుదేనని గగ్గోలు పెట్టే వైసీపీ, టీఆర్‌ఎస్‌ విషయంలో ఇంత మౌనం దాల్చడం చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. రాజకీయ పార్టీగా వైసీపీ బాధ్యతాయుతంగా ప్రవర్తించడం లేదనీ, ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకంలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం, ఆంధ్రప్రదేశ్‌ని అధికారం కోసమే అన్నట్లు వైసీపీ వాడుకుంటోందనీ, కొందరు రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని కుండ బద్దలుకొడుతున్నారు. జనసేన పార్టీ తెలంగాణా విద్యార్ధుల బలవన్మరణాలపై స్పందించింది. ప్రత్యక్షంగా విద్యార్ధుల కోసం పోరుబాట పట్టింది. తెలంగానా ప్రభుత్వాన్ని నిలదీసింది.

ఉన్నంతలో తెలుగుదేశం పార్టీ కూడా స్పందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణాలో విద్యార్ధుల బలవన్మరణాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆరు దశాబ్ధాలకు పైగా తెలుగు ప్రజలంతా ఒకే రాష్ట్రంగా కలిసి మెలిసి ఉన్నాం. రాష్ట్రాలుగా విడిపోయాం తప్ప ప్రజలుగా కాదు. పొరుగున ఉన్న మన బిడ్డలు, మన సోదరులు, మన సోదరీ మణులు కష్టాన్ని ఎదుర్కొంటోంటే కనీస సానుభూతి ప్రకటించాలి అనే ఇంగితం కూడా వైఎస్సార్‌సీపీలో కనిపించడం లేదు. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని సోషల్‌ మీడియా వేదికగా తెలుగు ప్రజలు ఇదే విషయమై ప్రశ్నిస్తున్నారు. కానీ స్పందించే ధైర్యం ఆయనకెక్కడిది.?

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...