Switch to English

సినీ జర్నలిస్ట్ ‘సంతోషం’ సురేష్‌ని బ్యాన్ చేశారా.? లేదా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,430FansLike
57,764FollowersFollow

ప్రముఖ సినీ జర్నలిస్టు, ‘సంతోషం’ సినీ పత్రిక అధినేత, సినీ నిర్మాత కూడా అయిన సురేష్ కొండేటి వ్యవహారం ప్రతిసారీ సినీ పరిశ్రమలో కలకలం రేపుతూనే వుంది. కొన్నాళ్ళ క్రితం ఓ హీరోయిన్ పుట్టుమచ్చల గురించి ప్రెస్ మీట్‌లో ప్రస్తావించి.. పెను వివాదానికి కారణమయ్యాడు.

పలువురు సినీ ప్రముఖులు, ప్రెస్ మీట్లలో సురేష్ కొండేటి మీద సెటైర్లు వేయడం, వాటిని సురేష్ కొండేటి లైట్ తీసుకోవడం తెలిసిన విషయాలే. ప్రతి యేడాదీ సంతోషం సినీ అవార్డ్స్ కార్యక్రమాన్ని సురేష్ కొండేటి నిర్వహిస్తుంటాడు. అత్యంత ప్రతిష్టాత్మకంగా వీటిని ఆయన నిర్వహిస్తుండడం తెలిసిన విషయమే.

అయితే, ఈ ఏడాది నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవం ఒకింత గందరగోళానికి కారణమైంది. తెలుగు సినిమా పరువు తీశాడంటూ విమర్శలు రావడంతో, దీనిపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కూడా స్పందించారు. మెగా పీఆర్వో.. అనే ట్యాగ్ అతను వినియోగించడంపైనా అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ వివాదం అనంతరం, సురేష్ కొండేటిని కొన్నాళ్ళపాటు ప్రెస్ మీట్లకు దూరంగా వుంచేలా తెలుగు సినీ జర్నలిస్టుల అసోసియేషన్ నిర్ణయం తీసుకున్నట్లు, సంబంధిత వాట్సాప్ గ్రూప్‌‌లో ఓ పోస్ట్ హల్‌చల్ చేసింది. దాంతో, సినీ జర్నలిస్టుల్లో చాలామంది ముక్కున వేలేసుకున్నారు.

తనను ఎవరూ బ్యాన్ చేయలేదనీ, డివోషనల్ టూర్‌లో వున్న తాను, ఆ టూర్ నుంచి తిరిగొచ్చాక యధాతథంగా ప్రెస్ మీట్లలో పాల్గొంటానంటూ సురేష్ కొండేటి సోషల్ మీడియా ద్వారా స్పష్టతనివ్వడంతో వివాదం కొత్త మలుపు తిరిగింది. బ్యాన్ చేశారా.? లేదా.? అన్నదానిపై సినీ వర్గాల్లోనూ జోరుగా చర్చ సాగింది.

కేవలం పీఆర్వోలు మాత్రమే, సురేష్ కొండేటిని బ్యాన్ చేయాలని నిర్ణయించారనీ, తెలుగు సినీ జర్నలిస్టుల యూనియన్ తరఫున ఎలాంటి బ్యాన్ లేదని ఇంకో వాదన తెరపైకొచ్చింది. ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లక్ష్మినారాయణ ఈ మేరకు ఓ వివరణాత్మక మెసేజ్ వాట్సాప్ ద్వారా పోస్ట్ చేశారు.

కాగా, ప్రెస్ మీట్స్ టైమింగ్స్ సహా పలు అంశాలపై తెలుగు సినీ జర్నలిస్టుల యూనియన్‌లో చర్చ జరిగింది. ఆ వివరాలన్నీ ఇప్పుడు వెబ్, మెయిన్‌స్ట్రీమ్ మీడియాలో చర్చకు కారణమవుతున్నాయి.

ఇంతకీ, సురేష్ కొండేటిని బ్యాన్ చేసినట్టా.? కాదా.? ఎవరి వెర్షన్ వారిది. సినీ జర్నలిస్టుల్లోనూ చాలామందికి సురేష్ కొండేటి అంటే గిట్టని పరిస్థితి వుంది. అదే ఈ గందరగోళానికి కారణమని చెప్పొచ్చేమో. మరోపక్క, పలువురు ఇతర సినీ జర్నలిస్టుల మీదా వివిధ కారణాలతో సాటి జర్నలిస్టుల్లో అభ్యంతరాలు వ్యక్తమవుతూ వస్తుండడం కొత్తేమీ కాదు.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి ని తెలుగు లో 'సత్య' గా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన మంచు...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...