దేశంలో కరోనా మహమ్మారి మరోసారి తారాస్థాయికి చేరింది. రోజుకు లక్షన్నరకు పైగా కేసులు వెలుగుచూస్తుండటం తీవ్రంగా ఆందోళన కలిగిస్తోంది. ఫలితంగా చూస్తుండగానే భారత్ మరోసారి రెండో స్థానానికి చేరింది. తాజాగా ఒకేరోజు 1,68,912 కేసులు నమోదు కావడంతో దేశంలో వైరస్ బారిన పడినవారి సంఖ్య 1,35,27,717కి చేరింది. దీంతో ఇప్పటివరకు రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్ మూడో స్థానానికి వెళ్లింది. 3,19,18,591 కేసులతో అమెరికా మొదటి స్థానంలో ఉంది. రెండో స్థానంలో భారత్ ఉండగా.. 1,34,82,543 కేసులో బ్రెజిల్ మూడో స్థానంలో ఉంది.
ప్రస్తుతం అమెరికా, బ్రెజిల్ లో కూడా నిత్యం భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా మరణాల్లోనూ అమెరికా అగ్రస్థానంలో ఉంది. అక్కడ 5,75,829 మంది ప్రాణాలు కోల్పోగా.. బ్రెజిల్ లో 3,53,293 మంది, మెక్సికోలో 2,09,212 మంది మరణించారు. వీటి తర్వాత 1.70 లక్షల మరణాలతో భారత్ నాలుగో స్థానంలో ఉంది. మొన్నటివరకు కేసులు తగ్గుముఖం పట్టినా.. అకస్మాత్తుగా పెరగడం ప్రారంభించాయి. ఈ క్రమంలో మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించాలని యోచిస్తున్నాయి. మిగిలిన రాష్ట్రాలు కూడా కరోనా నివారణ చర్యలు ప్రారంభించాయి.
559505 729452Many thanks for this particular info I was basically browsing all Search engines to discover it! 161582
161006 126492Taylor Lautner By the way you might want to take a look at this cool site I found 114086
619719 417466I like this internet blog very a lot so considerably superb information . 912902