Switch to English

గెలిస్తేనే అమరావతికి జగన్‌, లేదంటే కష్టమే.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,431FansLike
57,764FollowersFollow

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మే 23న వెల్లడయ్యే ఫలితాల తర్వాతనే అమరావతికి మకాం మార్చే విషయమై నిర్ణయం తీసుకుంటారట. అప్పటిదాకా, ఎవరేం చెప్పినా అమరావతికి మకాం మార్చేందుకు వైఎస్‌ జగన్‌ సుముఖంగా లేరని తెలుస్తోంది. వాస్తవానికి, ఎన్నికలకంటే ముందే జగన్‌, అమరావతికి మకాం మార్చేసి వుంటే బావుండేదని పార్టీ ముఖ్య నేతలు ఎంతలా అధినేత ముందు మొత్తుకున్నా ఆయన వినలేదట. పోనీ, పోలింగ్‌ అయ్యాక అయినా జగన్‌, అమరావతికి మకాం మార్చుతారా.? అంటే అదీ జరగలేదాయె.

‘మీ నాయకుడు హైద్రాబాద్‌లో వుండి రాజకీయాలు చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్‌ మీద మీ నాయకుడికి అంత గౌరవం వుంది’ అని పదే పదే టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్న విషయం విదితమే. ఓటుకు నోటు కేసు దెబ్బకి చంద్రబాబు, హైద్రాబాద్‌ నుంచి విజయవాడకు పారిపోవాల్సి వచ్చింది. అయితే, ఓ పద్ధతి ప్రకారం అమరావతికి షిఫ్ట్‌ అయ్యింది మాత్రం జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ మాత్రమే. రాజధాని ప్రాంతంలోనే ప్రస్తుతం పవన్‌కళ్యాణ్‌ నివాసం వుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జనసేన పార్టీ పోటీ చేస్తున్నా, ప్రధానంగా జనసేన కార్యకలాపాలు ఆంధ్రప్రదేశ్‌ నుంచే నడుస్తున్నాయి.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి తెలంగాణలో ‘స్టేక్‌’ లేదు. అసెంబ్లీ ఎన్నికల్లోగానీ, లోక్‌సభ ఎన్నికల్లోగానీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ నుంచి ఒక్క అభ్యర్థినీ నిలబెట్టలేదు. అయినాగానీ, హైద్రాబాద్‌ మీద వైఎస్‌ జగన్‌కి మమకారం తగ్గకపోవడం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల్నే ఆశ్చర్యపరుస్తోంది. ‘హైద్రాబాద్‌, ఆంధ్రప్రదేశ్‌కి ఉమ్మడి రాజధాని. హైద్రాబాద్‌లో ఆంధ్రప్రదేశ్‌కి హక్కులున్నాయి. అందుకే, జగన్‌ హైద్రాబాద్‌లో వుంటున్నారు’ అని కొందరు వైసీపీ నేతలు పైకి తమ అధినేతను వెనకేసుకొస్తున్నా, వారి అంతరంగం అందుకు భిన్నంగా కనిపిస్తోంది.

ఎన్నికల్లో గెలిస్తేనే అమరావతికి వెళదామని పార్టీ ముఖ్య నేతలకు వైఎస్‌ జగన్‌ తాజాగా సూచించారట. లేని పక్షంలో, హైద్రాబాద్‌ నుంచే రాజకీయాలు చేయాల్సి వుంటుందనీ జగన్‌ వారితో చెప్పారట. హైద్రాబాద్‌, ఉమ్మడి రాజధాని కాబట్టి.. హక్కులు వదులుకోవాల్సిన అవసరం లేదన్న మాటే ఇంకా గట్టిగా ప్రజలతో చెప్పాలంటూ వైఎస్‌ జగన్‌ చేసిన సూచనలతో వైఎస్సార్సీపీ నాయకులు ఏకీభవించలేని పరిస్థితి కనిపిస్తోంది.

ఏదిఏమైనా, ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణలో వుండి ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు చేస్తాననడం ఏమాత్రం సబబుగా లేదు. అమరావతిలో అత్యంత ఖరీదైన నివాసం కట్టుకుని కూడా అక్కడికి వెళ్ళి స్థిరపడకుండా, హైద్రాబాద్‌లోనే ఆయన వుండిపోతున్నారంటే కొంత అనుమానించాల్సిన విషయమే. తెలంగాణ రాష్ట్ర సమితికి దగ్గరగా వుండాలనా? ఇంకేదన్నా బలమైన కారణం ఆయన్ని ఆంధ్రప్రదేశ్‌కి దూరంగా వుండేలా చేస్తోందా?

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

ఎక్కువ చదివినవి

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన మంచు...

‘భజే వాయువేగం’ నుంచి ‘సెట్ అయ్యిందే’ సాంగ్ విడుదల

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ( Karthikeya ) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'భజే వాయువేగం'. ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను మూవీ టీం రిలీజ్ చేసింది. 'సెట్ అయ్యిందే'...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా...