Switch to English

జగన్‌ ఆకర్ష్: చంద్రబాబుకి మిగిలే నెంబర్‌ ఎంతంటే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆపరేషన్‌ ఆకర్ష్ మొదలు పెట్టేశారు. నిజానికి, ఎన్నికలకు ముందరే ఈ ఆపరేషన్‌ మొదలైంది. టీడీపీ నుంచి టిక్కెట్లు దక్కించుకున్నవారు కూడా ‘మాకు టిక్కెట్‌ వద్దు బాబోయ్‌..’ అంటూ వైసీపీలోకి జంప్‌ చేసేసిన విషయం విదితమే. ఎన్నికలయ్యాక టీడీపీకి కేవలం 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు మాత్రమే మిగిలారు.

ఈ మధ్యలో చాలా జరిగాయి. ఫలితాలు రాకముందే పలువురు టీడీపీ నేతలు వైఎస్సార్సీపీతో టచ్‌లోకి వెళ్ళారు. అలా వైసీపీతో టచ్‌లోకి వెళ్ళిన టీడీపీ నేతల లిస్ట్‌ చాలా పెద్దదే వుందట. అందులో తాజా ఎమ్మెల్యేలు కూడా వున్నట్లు తెలుస్తోంది. లెక్క పక్కాగా తన వద్ద వుంది గనుక, వైఎస్‌ జగన్‌ అసెంబ్లీ సాక్షిగా అధికార తెలుగుదేశం పార్టీకి ‘వార్నింగ్‌’ కూడా ఇచ్చారు. ‘మేం గనుక, పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహిస్తే పరిస్థితి ఎలా వుంటుందో తెలుసా.?’ అని ప్రతిపక్ష నేత చంద్రబాబుని జగన్‌ హెచ్చరించిన తీరు అందర్నీ ఆశ్చర్యపరిచింది.

గతంలో వైసీపీ బాధిత పార్టీ గనుక, ఇప్పుడు బాధ పెట్టే పార్టీగా మారడం తప్పేమీ లేదని కొందరు అనొచ్చుగాక. కానీ, ఇది ప్రజాస్వామ్యం. ఇక్కడ కొన్ని పద్ధతులున్నాయి. చెత్త పని చేసినందుకే చంద్రబాబుని అధికారంలోంచి పీకేసి, ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు ప్రజలు. అదే అహంకారం ఇప్పుడు వైఎస్‌ జగన్‌లో కన్పిస్తోంది. అధికారంలో చేతిలో వుంది కదా.. అని జగన్‌, అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతున్న తీరు ఏమాత్రం ఆహ్వానించదగ్గ పరిణామం కాదు. యువకుడు, పైగా బంపర్‌ మెజార్టీతో ముఖ్యమంత్రి అయిన వ్యక్తి. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాల్సింది పోయి, ప్రతిపక్ష నేతపై బెదిరింపులకు దిగడం హాస్యాస్పదం అన్నది రాజకీయ పండితుల అభిప్రాయం.

అయితే, ఇప్పుడు రాజకీయాలు అంత నీతివంతంగా వుండాలని ఆశించడం అత్యాశే అవుతుంది. తమతో చాలామంది టీడీపీ ఎమ్మెల్యేలు టచ్‌లో వున్నారని వైఎస్‌ జగన్‌ చెబితే, ’11 మంది తప్ప, టీడీపీలో మిగతా ఎమ్మెల్యేలంతా మా వెంట వచ్చేస్తారు..’ అని వైసీపీకి చెందిన ఓ ముఖ్య నేత టీవీ చర్చా కార్యక్రమాల్లో ప్రకటించడం గమనార్హం. అంటే, టీడీపీకి చంద్రబాబుని మినహాయిస్తే 10 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగలబోతున్నారన్నమాట. అదీ అతి కొద్ది రోజుల్లోనే. వైసీపీ వైపు వచ్చే టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ఉప ఎన్నికలకు వెళ్ళాలన్నది వైఎస్‌ జగన్‌ వ్యూహంగా కన్పిస్తోంది. అదే జరిగితే, ఇప్పుడున్న ‘ఫ్యాన్‌’ వేవ్‌లో తెలుగుదేశం పార్టీ ఇంకా సర్వనాశనమవుతుందని వైఎస్‌ జగన్‌ భావిస్తున్నారని అనుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

Elephant: గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ భద్రత.. వీడియో వైరల్

Elephant: కుటుంబం తమ పిల్లల సంరక్షణను ఎలా చూసుకుంటుందో మానవ సంబంధాలలో చూస్తూంటాం. తమకూ తెలుసనిపించేలా ఉన్న అడవిలోని ఏనుగులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’లో...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...