Switch to English

జనసేనాని ప్రభంజనం.! కూకట్‌పల్లి దద్దరిల్లిపోయింది.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,762FansLike
57,764FollowersFollow

కూకట్‌పల్లి నియోజకవర్గంపై మొదటి నుంచీ జనసేన పార్టీ ప్రత్యేకమైన దృష్టిపెడుతూ వచ్చింది. చివరి నిమిషంలో బీజేపీ, ఆ నియోజకవర్గాన్ని పొత్తులో భాగంగా తన్నుకుపోతుందనే ప్రచారం జరిగినా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వ్యూహాత్మకంగా ఆ నియోజకవర్గాన్ని జనసేనకే కేటాయించుకునేలా చేయగలిగారు.

బీజేపీలో అప్పటిదాకా వున్న మమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, జనసేనలోకి వచ్చారు.. జనసేన నుంచి కూకట్‌పల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా టిక్కెట్ సాధించారు. అప్పటిదాకా ఆ టిక్కెట్టుని ఆశించిన జనసేన తెలంగాణ ముఖ్య నేత ఒకరు, ఆ టిక్కెట్టుని త్యాగం చెయ్యక తప్పలేదు.
కూకట్‌పల్లి నియోజకవర్గంలో పోటీ అంటే, ఆర్థికంగానూ బలంగా వుండాలి మరి.! ఈ కోణంలోనే, మమ్మారెడ్డి వైపు జనసేనాని వ్యూహాత్మకంగా మొగ్గు చూపాల్సి వచ్చింది. కూకట్‌పల్లిలో పోటీ చేయాల్సిన జనసేన ముఖ్య నేత, వేరే నియోజకవర్గం వైపు వెళ్ళారు. అది వేరే సంగతి.

ఇక, కూకట్‌పల్లిలో నిన్న జనసేన పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. కనీ వినీ ఎరుగని రీతిలో జనం ఈ బహిరంగ సభకు హాజరయ్యారు. వాస్తవానికి జనసేన నిర్వహించిన బహిరంగ సభ అయినా, బీజేపీ ఈ నియోజకవర్గాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, సభను సక్సెస్ చేసింది.

అంతకు ముందు వరకు కూకట్‌పల్లి విషయమై ఓ మోస్తరు అంచనాలే వుండేవి జనసేన క్యాడర్‌కి. ఇప్పుడు ఆ ఆశలు పదింతలయ్యాయ్. అంచనాలు పెరిగిపోయాయ్. ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేన – బీజేపీ కూటమి ఖచ్చితంగా గెలిచే నియోజకవర్గం కూకట్‌పల్లి.. అని రాజకీయ విశ్లేషకులూ అభిప్రాయపడే స్తాయికి ఇక్కడ ఈక్వేషన్స్ మారిపోయాయ్.

కాంగ్రెస్ అభ్యర్థి దాదాపుగా ఆశలు వదిలేసుకోగా, అధికార పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా చేతులెత్తేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

సినిమా

Ntr-Rajamouli: ఎన్టీఆర్-రాజమౌళిపై దాదాసాహెబ్ ఫాల్కే మనవడి కామెంట్స్ వైరల్..!

Ntr-Rajamouli: భారతీయ సినిమాకు పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ తెరకెక్కించేందుకు బాలీవుడ్ సిద్ధమైంది. అమీర్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో సినిమా తెరకెక్కనుందనే...

‘సింగిల్’ ని బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్.. అల్లు అరవింద్

సింగిల్ మూవీని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు అల్లు అరవింద్ స్పెషల్ థాంక్స్ చెప్పారు. శ్రీ విష్ణు హీరోగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో...

చిరు-అనిల్ మూవీలో నయనతార ఫిక్స్.. క్రేజీ వీడియో..

మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి మూవీపై రోజుకొక అప్డేట్ ఇస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్ గురించి ఇప్పటికే చాలా చర్చలు జరిగాయి. చాలా మంది పేర్లు వినిపించాయి....

కన్నప్ప కామిక్ సిరీస్.. ఫైనల్ వీడియో రిలీజ్..

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ప్రమోషన్లు జోరందుకున్నాయి. జూన్ 27న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో ప్రభాస్, కాజల్, మోహన్ లాల్ కీలక పాత్రల్లో...

పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ‘వీరమల్లు’ రిలీజ్ డేట్ వచ్చేసింది

పవన్ కల్యాణ్‌ ఫ్యాన్స్ ఎంతగానో ఎదరు చూస్తున్న హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ డేట్ ఎట్టకేలకు ప్రకటించారు. జూన్ 12న ఈ మూవీని రిలీజ్ చేస్తున్నామని...

రాజకీయం

పాకిస్థాన్ వాళ్ల ఇళ్లలోకి వెళ్లి కొడుతాం.. పవన్ కల్యాణ్‌ ఫైర్..

పాకిస్థాన్ మన భారతదేశం జోలికి వస్తే వాళ్ల ఇళ్లలోకి వెళ్లి కొడుతాం అని పవన్ కల్యాణ్‌ ఫైర్ అయ్యారు. పాకిస్థాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తోందని.. అలాంటి వారిని అస్సలు క్షమించకూడదు అంటూ తెలిపారు....

లిక్కర్ స్కామ్: అన్యాయం, అక్రమం.. అంటూ వైసీపీ గగ్గోలు.!

దేశాన్ని కుదిపేసింది ఢిల్లీ లిక్కర్ స్కామ్. ఈ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రిగా వున్న సమయంలో అరవింద్ కేజ్రీవాల్ ఎదుర్కొన్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. మంత్రి సహా ముఖ్యమంత్రి కూడా జైలుకు వెళ్ళారు....

చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్.. పెట్టుబడుల జోరు..

ఏపీలో పారిశ్రామిక రంగం మళ్లీ పరుగులు పెడుతోంది. గత ఐదేళ్లలో అసలు ఏపీలో పెట్టుబడుల ఊసే లేదు. కేవలం ప్రచారాలకే పరిమితం అయింది వైసీపీ. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లీ...

రెడ్ బుక్ ను మరువం.. కేడర్ జోలికి వస్తే వదలనుః నారా లోకేష్‌

'కూటమి అధికారంలోకి వచ్చాక అందరినీ కలుపుకుని పోతున్నాం. సంక్షేమం, అభివృద్ధిని ఒకే తాటిపై తీసుకెళ్తున్నాం. అలా అని అన్యాయం చేసిన వారిని వదిలిపెట్టేది లేదు. రెడ్ బుక్ ను మరువం. కచ్చితంగా అమలు...

2029 నాటికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇదీ.!

2024 ఎన్నికల్లో వై నాట్ 175 అని నినదించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, అధికారాన్ని కోల్పోయింది.. ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. నిజానికి, ఘోర పరాజయంపై వైసీపీ నేతలు ఓ స్పష్టతతోనే వున్నా,...

ఎక్కువ చదివినవి

వైఎస్ జగన్ పాదయాత్ర.! బెదిరిపోతున్న వైసీపీ నేతలు.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి త్వరలో పాదయాత్ర చేయబోతున్నారట. ఈ విషయాన్ని వైసీపీ నేతలే చెబుతున్నారు. అయితే, అప్పుడే కాదు లెండి.. ఇంకాస్త సమయం...

‘ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా’ మేగజైన్ కవర్ పేజీపై విజయ్..

విజయ్ దేవరకొండ మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. టాలీవుడ్ లో వైవిధ్యభరితమైన సినిమాలు చేస్తున్న విజయ్ ను.. మేగజైన్స్ కూడా క్యాప్చర్ చేసేస్తున్నాయి. ఇప్పటి వరకు చాలా మేగజైన్స్ మీద కనిపించిన...

ఓటీటీలో రాబిన్ హుడ్ కు 50 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్‌..

నితిన్ హీరోగా వచ్చిన రాబిన్ హుడ్ ఓటీటీలో దూసుకుపోతోంది. వెంకీ కుడుముల డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా మే10 నుంచి ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ZEE5లో స్ట్రీమింగ్ అవుతోంది. విడుదలైనప్పటి నుంచి...

నితిన్ ‘తమ్ముడు’ మూవీ జులై 24కు వాయిదా..?

యంగ్ హీరో నితిన్ తమ్ముడు మూవీతో గట్టి హిట్ కొట్టాలనే తాపత్రయంలో ఉన్నాడు. వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ తెరకెక్కించిన తమ్ముడు మూవీకి మంచి హైప్ ఉంది. ఇప్పటికే వచ్చిన టీజర్...

టర్కీ కోసం మన డబ్బులు ఖర్చు పెట్టొద్దు : నిఖిల్

ప్రస్తుతం ఇండియా-పాకిస్థాన్ నడుమ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. పాకిస్థాన్ కు టర్కీ సాయం చేస్తూ తన వక్రబుద్ధి చాటుకుంది. మన దేశం మీద పాకిస్థాన్ దాడి చేసిన డ్రోన్లు...