బడ్జెట్ రూపకల్పన అంటే ఆషా మాషీ వ్యవహారం కాదు. నిజానికి ఏ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టినా, అందులో అధికారుల కష్టమే ఎక్కువ. అమాత్యులు ఒడ్డున కూర్చొని, మాటలు చెబితే, అధికారులు కిందా మీదా పడి, అమాత్యులు చెప్పిన విషయాలకు అనుగుణంగా లెక్కలు మార్చాల్సి ఉంటుంది. ఏ ప్రభుత్వంలోనైనా ఇదే పరిస్థితి. ఇలాంటి సందర్భాల్లోనే అనుభవం అనే విషయం చర్చకు వస్తుంది.
తొలిసారిగా వైఎస్ జగన్ ప్రభుత్వం బడ్జెట్ని ప్రవేశపెట్టబోతోంది. ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి ఆల్రెడీ కసరత్తుల్ని ఓ కొలిక్కి తెచ్చేశారట. మరో పక్క ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బడ్జెట్ అంచనాలకు తనదైన శైలిలో మార్పులు సూచించడం సహజమే. అయితే, కొత్త ప్రభుత్వం తొలి అనుభవం, వెరసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ పెట్టబోయే బడ్జెట్ ఎలా ఉంటుంది.? అన్న ఉత్కంఠ అందరిలోనూ కనిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితి అందరికీ తెలిసిందే. తిమ్మిని బమ్మిని చేస్తే తప్ప బండి నడవని పరిస్థితి. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే, ఉద్యోగులకు ఠంచనగా నెల్లో మొదటి రోజున జీతాలు ఇవ్వడమే గగనంగా మారిపోతున్న పరిస్థితి. కానీ, తొలి బడ్జెట్ కనుక ఆ బడ్జెట్పై ప్రజల్లో చాలా ఆశలుంటాయి కనుక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అద్భుతాలే చూపించాలి అందులో. ‘అమ్మ ఒడి’ సహా, నవరత్నాలకు నిధులు కేటాయింపు అంత ఈజీ కాదు.
పాదయాత్ర సందర్భంగా వచ్చిన వినతుల్నీ, ఆ సమయంలో ఇచ్చిన హామీల్ని పరిగణనలోనికి తీసుకుని వేతనాల్ని పెంచేశారు కనుక, అదో పెద్ద తలనొప్పి. ప్రాజెక్టులకు నిధులు, వ్యవసాయ రంగానికి కేటాయింపులు, విద్యా, వైద్య రంగాలకు ఇవ్వాల్సిన నిధులు.. చెప్పుకుంటూ పోతే తడిసి మోపెడవుతుంది. 2 లక్షల కోట్లు కాదు కదా.. 3 లక్షల కోట్లు బడ్జెట్ పెట్టినా ఇచ్చిన హామీల్ని నెరవేర్చడం అంత తేలిక కాదని ఆర్ధిక రంగ నిపుణులు ప్రభుత్వంపై విసుర్లు షురూ చేశారు.
పైగా కేంద్రం అస్సలేమాత్రం ఆంధ్రప్రదేశ్ని పట్టించుకోవడం లేదాయె. సో తొలి బడ్జెట్లోనే జగన్ సర్కార్ బండారం బయటపడిపోతుందని అంతా అభిప్రాయపడుతున్నారు.
701376 231080Having been basically searching at valuable weblog articles with regard to the project research when My partner and i happened to stumble on yours. Thanks for this practical info! 765300