దేశంలోనే నెం.1 బిలియనీర్ అయిన ముఖేష్ అంబానీ ఇంటి గురించి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ముంబయిలో ఒక ట్యాక్సీ డ్రైవర్ ను అడిగినట్లుగా తెలుస్తోంది. వారి చేతిలో ఆ సమయంలో ఒక అనుమానిత బ్యాగ్ ఉందని ఆ ట్యాక్సీ డ్రైవర్ చెబుతున్నాడు. దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా హై ఎలర్ట్ అయ్యారు. అంబానీ ఇంటి వద్ద వందల సంఖ్యలో పోలీసు బలగాలు మోహరించాయి. కేంద్ర మరియు రాష్ట్ర బలగాలతో పాటు ఉన్నతాధికారులు అక్కడకు చేరుకున్నారు.
అంబానీ ఇంటి గురించి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అనుమానితులు విచారించారనే విషయం బయటకు వచ్చిన నేపథ్యంలో వెంటనే వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ఇద్దరిపై అనుమానం ఉన్నట్లుగా ట్యాక్సీ డ్రైవర్ చెప్పడంతో పాటు వారి కదలికలు కూడా అనుమానంగా ఉన్నాయంటున్నారు. అందుకే వారిపై ఒక కన్నేసి ఉంచాలనే ఉద్దేశ్యంతో పెద్ద ఎత్తున అంబానీ ఇంటి వద్ద హై సెక్యూరిటీ పెంచామని.. అలాగే ముంబయి మొత్తం కూడా ఆ ఇద్దరి కోసం జల్లెడ పడుతున్నామని రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.
751741 14140Merely wanna state that this really is really beneficial , Thanks for taking your time to write this. 214166
477024 379583Nice internet site. On your blogs extremely interest and i will tell a friends. 44335