Switch to English

హైకోర్టులో తేలనున్న అమరావతి ఖర్చుల లెక్కలు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

రాజధాని అమరావతికి సంబంధించి చంద్రబాబు హయాంలో జరిగిన ఖర్చెంత.? అంటూ హైకోర్టు ప్రశ్నించింది. రాజధాని తరలింపు సహా, పలు పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ సందర్భంగా రాజధానిలో ఇప్పటికే నిర్మితమయిన, నిర్మాణంలో వున్న, నిర్మాణంలో కావాల్సిన భవనాలకు సంబంధించిన లెక్కల్ని తేల్చాలన్నీ తమ ముందుంచాలని ఆదేశించింది.

‘ఏడాదిగా నిర్మాణాలు ఆపేసినట్లు కన్పిస్తోంది.. మరి, ఇప్పటికే నిర్మాణాలు పూర్తయిన భవనాల్ని ఏం చేద్దామనుకుంటున్నారు.? వాడకంలో లేకపోతే ఆ భవనాలు పాడైపోయే అవకాశం వుంది కదా. అవి ప్రజా ధనంతో నిర్మించిన భవనాలు. ఎవరు జవాబుదారీతనం వహిస్తారు.?’ అని ప్రశ్నించింది న్యాయస్థానం. పూర్తి వివరాలు తమ ముందుంచేలా అకౌంటెంట్‌ జనరల్‌కి నోటీసులు పంపాలని న్యాయస్థానం ఆదేశించింది.

అమరావతికి సంబంధించి ఇది అత్యంత కీలకమైన అంశంగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. రాజధాని అనేది వైఎస్‌ జగన్‌ – చంద్రబాబు మధ్య ఆదిపత్య పోరుకి సంబంధించిన వ్యవహారం కానే కాదు. చంద్రబాబు అయినా, వైఎస్‌ జగన్‌ అయినా.. ఖర్చు చేసిందీ, చేస్తున్నదీ, చేయబోయేదీ ప్రజాధనమే. అలాంటప్పుడు ఒకరి మీద అక్కసుతో ఇంకొకరు కీలకమైన రాజధాని వంటి విషయాల్లో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తే ఎలా.? ‘మేం రాజధానిని మార్చడంలేదు..’ అని వైసీపీ నేతలు బుకాయిస్తున్నా, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఎన్నికల సమయంలో ‘రాజధాని అంటే ఏంటో ఇచ్చిన వివరణ’ చూస్తే వారికే అసలు విషయం అర్థమవుతుంది.

రాజధాని అంటే అసెంబ్లీ, సెక్రెటేరియట్‌, హైకోర్టు.. కొన్ని ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాలు.. అని ఇదే వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి గతంలో చెప్పారు. మరి, ఆ రాజధాని నుంచి హైకోర్టుని తరలించి, ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ని తరలిస్తే.. అమరావతికి మిగిలేదేంటి.? ఇదిలా వుంటే, సుమారు 52 వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా వివిధ దశల్లో వున్నట్లు హైకోర్టు ముందుకు సీఆర్డీయే రికార్డుని న్యాయస్థానం ముందుంచారు న్యాయవాది. దీంట్లో ఇప్పటికే 10 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు సాక్షాత్తూ ప్రభుత్వమే చెబుతోందాయె. సో, పూర్తి లెక్కలు న్యాయస్థానం ముందుకొస్తే, అమరావతికి సంబంధించి అధికార వైసీపీ చేస్తోన్న దుష్ప్రచారం బట్టబయలయ్యే అవకాశం వుందన్నది ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఉవాచ.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree). కమలేష్ కుమార్ నిర్మాత. మే24న విడుదలవుతోన్న...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...