గత వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దాంతో అన్ని చెరువులు నదులు పొంగి పొర్లుతున్నాయి. గోదావరి నదికి భారీగా వరద పోటెత్తిన నేపథ్యంలో పరివాహక ప్రాంతాలు అన్ని కూడా జలమయం అయ్యాయి. గత యాబై ఏళ్లలో ఈ స్థాయి నీళ్లు గోదావరికి రావడం ఇది నాల్గవ సారి అంటూ నిపుణులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటికే గోదావరి పరివాహక ప్రాంతాలపై దృష్టి పెట్టి వారిని సహాయకేంద్రాలకు తరలించారు.
భద్రాచలంతో పాటు తెలంగాణలో గోదావరి పరివాహక ప్రాంతం అంతటా కూడా హైటెన్షన్ నెలకొంది. ఇక ఏపీ విషయానికి వస్తే ఉభయ గోదావరి జిల్లాలు సగం వరకు గోదావరి నీటితో ముగిని ఉన్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరింతగా ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందంటున్నారు. గోదావరి జిల్లాల్లో సహాయక కార్యక్రమాలకు జగన్ ప్రభుత్వం ఆదేశించింది. తూర్పు గోదావరి జిల్లాలోని 23 మండలాల పరిధిలోని దాదాపు 150 గ్రామాలు ముంపుకు గురి అయ్యాయి. దాదాపు 60 గ్రామాలతో సంబంధాలు తెగి పోయాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో గోదావరి ఉగ్రరూపంతో జనాలు భయాందోళనకు గురి అవుతున్నారు.
517024 151091Howdy! I just want to give an enormous thumbs up for the fantastic details you might have here on this post. I will likely be coming back to your weblog for far more soon. 27154