మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లీడ్ రోల్ లో నటిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్. అగ్ర దర్శకుడు శంకర్ ఈ సినిమాకు దర్శకుడు. ప్యాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. దిల్ రాజు దీనికి నిర్మాత. ఇక అసలు విషయానికి వస్తే గేమ్ ఛేంజర్ ను రెండు భాగాలుగా చేయాలి అనేది దిల్ రాజు ఆలోచన అట. శంకర్ కూడా దీనికి సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది.
నిజానికి గేమ్ ఛేంజర్ కథ అనుకున్నప్పుడు రెండు భాగాలుగా తీద్దాం అన్న ఆలోచన లేదు. అయితే భారీ బడ్జెట్ సినిమా కావడంతో రెండు భాగాలు అయితే ఈజీగా వర్కౌట్ అవుతుంది అని నిర్మాతగా దిల్ రాజు ఆలోచిస్తున్నాడు. కానీ దీనికి రామ్ చరణ్ అంత సానుకూలంగా లేడు. ప్రస్తుతం తనకు చాలానే కమిట్మెంట్స్ ఉన్నాయి. త్వరగా వాటికి మూవ్ అవ్వాలనుకుంటున్నాడు.
ప్రస్తుతం ప్యాన్ ఇండియా సినిమాల్లో రెండు భాగాల ట్రెండ్ బలంగా నడుస్తోన్న విషయం తెల్సిందే.