రానా దగ్గుబాటి, తేజ కాంబినేషన్ లో వచ్చిన నేనే రాజు నేనే మంత్రి చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం సూపర్బ్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు వీరి కాంబినేషన్ లో మరో సినిమా రూపొందుతోంది.
తేజ రీసెంట్ చిత్రం అహింస ఈవెంట్ లో వీరి కాంబోలో తెరకెక్కే సినిమాకు రాక్షస రాజు అనే టైటిల్ పెట్టినట్లు తేజ అనౌన్స్ చేసాడు. ఇక ఇప్పుడు ఈ చిత్రానికి ముహూర్తం ఖరారైంది. రాక్షస రాజుకు ఈ నెల 28న కొబ్బరి కాయ కొట్టనున్నారు. రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది అనేది త్వరలోనే ప్రకటిస్తారు.
రానా దగ్గుబాటి సరసన మొత్తం ముగ్గురు హీరోయిన్లు నటిస్తారని తెలుస్తోంది. అయితే వారి వివరాలు కూడా త్వరలోనే తెలుస్తాయి.