అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి నేడు శంకుస్థాపన జరిగింది. లాక్ డౌన్ నుంచి కాస్త వెసులుబాటు రావడంతో నేడు ఈ కార్యక్రమం నిర్వహించారు. రామ జన్మభూమి ప్రాంతంలో ఉన్న కుబేర్ తిలలో ఈ భూమి పూజ కార్యక్రమం నిరాడంబరంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్.. అధికార ప్రతినిధి మహంత్ కమల్ నయన్ దాస్ పాల్గొన్నారు.
కార్యక్రమంలో భాగంగా మొదట శివుడికి రుద్రాభిషేకం నిర్వహించారు. క్రతువులో భాగంగా ఉదయం 8:00 గంటలకు మహంత్ కమల్ నయన్ దాస్ రుద్రాభిషేకం నిర్వహించారు. సుమారు 2 గంటల పాటు జరిగిన క్రతువులో ఇతర సాధువులు పాల్గొన్నారు. అనంతరం ఆలయ నిర్మాణ పనులకు సంబంధించి పునాది రాయి వేసి రామ జన్మభూమి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర సభ్యులు మాట్లాడుతూ.. లంకపై యుద్ధానికి వెళ్లే ముందు రాముడు రుద్రాభిషేకంతో శివుణ్ని ప్రార్థించాడు. రాముడు తొలిపూజ నిర్వహించిన సంప్రదాయాన్నే తామూ పాటించామని తెలిపారు. మే 11న ఆలయ నిర్మాణం కోసం భూమిని చదును చేశామని.. ఈరోజు పునాది రాయి వేశామన్నారు.
త్వరలోనే ప్రధాని మోదీని కూడా కలుస్తామని మహంత్ కేఎన్ దాస్ తెలిపారు. కరోనా లేకుంటే ప్రధాని మోదీయే మందిర నిర్మాణానికి భూమి పూజ చేసేవారని చెప్పారు. అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పు అనంతరం రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమమైన సంగతి తెలిసిందే.
443861 532070Some times its a discomfort inside the ass to read what blog owners wrote but this website is quite user friendly ! . 107206