వైసీపీ ప్రభుత్వం సదుద్దేశంతో ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థ అక్కడక్కాడా గాడి తప్పుతోంది. వైసీపీ నాయకుల తీరే ఇందుకు కారణమవుతోంది. ప్రజలకు జవాబుదారీగా ఉండే వాలంటీర్లను సొంత పనులకు ఆదేశించడమే తప్పు. అటువంటిది ఓ మహిళా వాలంటీర్ పైనే అధికార పార్టీ నేతలు జులుం ప్రదర్శించడం విమర్శలకు తావిస్తోంది. అనంతపురం జిల్లా దయ్యాలకుంటపల్లిలో జరిగిన ఘటన వివాదాస్పదమవుతోంది.
స్థానికంగా వాలంటీర్ గా పనిచేస్తోంది చంద్రలేఖ. వైసీపీ నేతలు శివారెడ్డి, కాటమయ్య ఆమెను సెలూన్ షాప్ దగ్గరికి వెళ్లి క్షురకులు ఉన్నారో లేదో చూసి రమ్మని చెప్పారు. ఇది తన ఉద్యోగ విధుల్లో భాగం కాదని చంద్రలేఖ చెప్పడం వారికి ఆగ్రహం తెప్పించింది. చెప్పిన పని చేయకుంటే ఉద్యోగం లేకుండా చేస్తామని ఆమెను హెచ్చరించారు.
తనను ఇలా వేధించడం తగదని ఎదురు తిరిగింది చంద్రలేఖ. దీంతో వారు ఉన్నతాధికారులతో ‘2రోజుల్లో లిఖితపూర్వకంగా సమాధానం చెప్పా’లంటూ ఆమెకు షోకాజు నోటీసు ఇప్పించారు. సమాధానం ఇవ్వకపోతే ఉద్యోగం లోంచి తొలగిస్తామన్నారు. దీంతో చంద్రలేఖ తల్లి.. వైసీపీ నేతల తీరుపై నిలదీయడంతో వారిద్దరిపై దాడికి పాల్పడ్డారు. చేసేది లేక చంద్రలేఖ, ఆమె తల్లి పోలీసుల్ని ఆశ్రయించారు.
ఈ విషయమై వైసీపీ నేతల నుంచి కూడా ఫిర్యాదు వచ్చిందని.. ఏం జరిగిందో విచారిస్తున్నామని.. తదుపరి చర్యలు తీసుకుంటామని సమాధానం వచ్చింది. అయితే.. విషయం పోలీస్స్టేషన్ వరకూ వెళ్లడంతో సదరు వైసీపీ నేతలు రాజీ ప్రయత్నాలు మొదలుపెట్టారని తెలుస్తోంది.
407927 711367Hello Guru, what entice you to post an post. This post was really intriguing, specifically since I was searching for thoughts on this topic last Thursday. 191204
280273 700849Overall, politicians are split on the issue of whether Twitter is much more for business or personal use. The initial thing may be the fact which you can build up quite a large following of men and women. 644942
36222 893293hey there i stumbled upon your internet site searching about the web. I wanted to say I enjoy the appear of points around here. Keep it up will save for certain. 245224