విదేశాల్లో చదవులుకోవాలంటే ఇకపై అక్కడకు వెళ్లక్కర్లేదు. మనదేశంలోనే ఉండి చక్కడా అక్కడి కోర్సులు చేసేయొచ్చు. ఈ మేరకు విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) తగిన కార్యాచరణ రూపొందించింది. దీని ప్రకారం విదేశీ విద్యాసంస్థలు, భారతీయ విద్యాసంస్థలు కలిసి పనిచేస్తాయి. దీనికి సంబంధించి ముసాయిదా ప్రతిపాదనలను యూజీసీ సిద్ధం చేసింది. వీటిపై అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకుని తుది ప్రతిపాదనలు రూపొందిస్తుంది. కొత్త విధానం ప్రకారం భారతీయ విద్యాసంస్థలు విదేశాల్లోని విద్యా సంస్థలతో కలిసి పనిచేస్తాయి. ఇక్కడ మన విద్యార్థులకు విదేశీ కోర్సులు అందిస్తాయి.
మార్కుల విషయానికి వస్తే 30 నుంచి 50 శాతం మార్కులు మన విద్యాసంస్థల చేతుల్లో ఉండగా.. 50 నుంచి 70 శాతం మార్కులు విదేశీ విద్యాసంస్థలు వేస్తాయి. న్యాక్ గుర్తింపును బట్టి ఈ మార్కుల విషయంలో సడలింపులు ఉంటాయి. ఈ విధానం వల్ల మన విద్యార్థులకు చాలా లాభాలుంటాయి. 2019లో దాదాపు ఏడున్నర లక్షల మంది విద్యార్థులు చదువు నిమిత్తం విదేశాలకు వెళ్లారు. దానివల్ల బోలెడంత భారత కరెన్సీ విదేశాలకు తరలి వెళ్తోంది. అంతేకాకుండా విదేశాలకు వెళ్లిన విద్యార్థులు అక్కడే స్థిరపడుతున్నారు. కొత్త విధానం వల్ల అటు కరెన్సీ విదేశాలకు వెళ్లదు.. మన విద్యార్థులు ఇక్కడే ఉండే అవకాశం ఉందని అంటున్నారు.
220113 58728You created some decent points there. I looked on the net for any concern and located most individuals goes in addition to with all your web site. 343566
516113 71750A person essentially assist to make seriously articles I would state. This is the initial time I frequented your internet site page and thus far? I surprised with the research you made to make this certain publish incredible. Great job! 418290