Karnataka: కర్ణాటకలో (Karnataka) కాంగ్రెస్ (Congress) గెలుపుకై నిన్నటి వరకూ మాజీ సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah) , కేసీసీసీ చీఫ్ డీకే శివకుమార్ (DK Siva Kumar) వర్గీయులు ఒక్కతాటిపై నడుచి విజయం సాధించారు. అధిష్టానం, రాష్ట్ర కాంగ్రెస్ సంబరాల్లో ఉండగా అధికారం కోసం కోట్లాటలు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈరోజు ఉదయం వెలిసిన ఫ్లెక్సీలో ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి.
తమ నాయకుడినే సీఎం చేయాలని ఇరువర్గాల బ్యానర్లు వెలిశాయి. రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో తమ నాయకుడు సమర్ధుడని పేర్కొంటున్నారు. తన తండ్రి సీఎంగా అర్హుడని సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర అంటుంటే.. తన సోదరుడిని సీఎంను చేస్తే రాష్ట్ర ప్రజలు సంతోషిస్తారని శివకుమార్ సోదరుడు సురేశ్ అంటున్నారు.
మాజీ సీఎంగా పార్టీని, ప్రభుత్వాన్ని ఒంటిచేత్తో నడిపే సత్తా సిద్ధరామయ్యకు ఉంది. కొన్నేళ్లుగా రాష్ట్రంలో కాంగ్రెస్ ఉరకలెత్తేలా చేసి ట్రబుల్ షూటర్ గా ప్రస్తుత గెలుపులో కీలకంగా మారిన నేతగా డీకె శివకుమార్ కు అధిష్టానంలో పేరుంది. నేటి సాయంత్రం బెంగళూరులో 5.30కి భేటీకానున్న సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని ఎన్నుకోనున్నారు.