ప్రస్తుతం టాలీవుడ్ లో చాలా మంది హీరోలకి రిలీజ్ డేట్స్ అనేవి సమస్య లుగా మారాయి. కొంతమంది ముందే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినా సడన్ గా కొంతమంది చివరి నిమిషంలో ఆ డేట్స్ ఫిక్స్ అవుతుండడం వల్ల క్లాష్ వస్తుండడం మళ్ళీ చివరి నిమిషంలో డేట్స్ మార్చుకోవాల్సి వస్తోంది. అలాంటి సమస్యే ఈ ఏడాది క్రిస్మస్ కి రిలీజ్ అనుకున్న సినిమాలకి వచ్చింది.
రవితేజ నటిస్తున్న ‘డిస్కో రాజా’, నితిన్ నటిస్తున్న ‘భీష్మ’ సినిమాలు ముందే క్రిస్మస్ కి వస్తాయని చెప్పినప్పటికీ సడన్ గా నెలకొన్న కొన్ని పరిస్థితుల వలన ఇవి అప్పుడు వెనక్కి వెళ్లాయి. ప్రస్తుతం కొన్ని రోజులుగా క్రిస్మస్ రిలీజ్ విషయంలో నెలకొన్న హై డ్రామా ముగిసింది. ఫైనల్ గా ముగ్గురు హీరోలు క్రిస్మస్ వీక్ ని పంచుకోనున్నారు. ఆ వివరాలలోకి వెళితే..
- సాయి ధరమ్ తేజ్ – రాశీఖన్నా – మారుతి కాంబినేషన్ లో వస్తున్న ‘ప్రతిరోజూ పండగే’ సినిమా డిసెంబర్ 20న రిలీజ్ కానుంది. ఇప్పటికైతే ఈ సినిమా అదే డేట్ కి ఫిక్సయ్యి ఉంది.
- విక్టరీ వెంకటేష్ – యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య కలిసి నటిస్తున్న ‘వెంకీ మామ’ సినిమా ఫైనల్ గా డిసెంబర్ 20న రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయ్యారు.
- నందమూరి బాలకృష్ణ – కెఎస్ రవికుమార్ డైరెక్షన్ లో రూపొందుతున్న సినిమాని డిసెంబర్ 25న రిలీజ్ చేయడానికి లాక్ చేశారు.ఈ సినిమాకి ‘రూలర్’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు.
- ఇది కాకూండా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన బ్లాక్ బస్టర్ సీరీస్ ‘దబాంగ్ 3’ కూడా డిసెంబర్ 20న క్రిస్మస్ కానుకగా తెలుగులో రిలీజ్ కానుంది.
247222 763108Beneficial information. Fortunate me I discovered your internet internet site by chance, and Im surprised why this twist of fate didnt happened earlier! I bookmarked it. 953198