నిజానికి చంద్రబాబు ఈ ఎన్నికల్లో ఎక్కువగా ప్రస్తావించని అంశం రైతు రుణమాఫీనే. ఇంకా రైతులకు పూర్తిగా ఇవ్వని కారణంగా బాబు గట్టిగా రైతలును ఓట్లు ఆడగలేకపోయారు. అసలు ఆ విషయం ప్రస్తావించడానికే ఆయన ఇష్టపడలేదు. సంపూర్ణంగా కాకపోయిన ప్రకటించిన విధంగా మరో రెండు విడతలు రైతులకు ఇవ్వవలసి ఉంది. గత వారంరోజుల నుంచి రుణమాఫీ వేస్తున్నాను తీసుకోండి అన్న చంద్రబాబు కేవలం నోటి మాటలకు మాత్రమే పరిమితం అయ్యాయి. ఇంతవరకూ బ్యాంకులకు సదరు డబ్బులు జమకాలేదు. కేవలం అన్నధాత సుఖీభవ కింద మొదట వెయ్యి, తరువాత 3వేల రూపాయలు మాత్రమే జమ అయ్యాయి. రుణమాఫీ ఖచ్చితంగా ఎన్నికల లోపు వేస్తారని రైతులు భావించారు. కానీ అదికాస్తా అటకెక్కింది.
ఎమ్మెల్యేల ఆశ నీరుగారిపోయింది..
టీడీపీ ఎమ్మెల్యేలు ఈదఫా ఎక్కువగా ఆశ పెట్టుకుంది.. డ్వాక్రా, పసుపుకుంకుమ, వృద్ధాప్య ఫెన్షన్, రైతు రుణమాఫీ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. ఏ పల్లెల్లోకి వెళ్లినా ఎక్కువగా రైతు రుణమాఫీ మీదే నిలదీసేవారు. కానీ చంద్రబాబు హామీతో ఖచ్చితంగా రైతుల ఖాతాల్లో డబ్బులు పడతాయి.. ఇక తమకు రైతులు గంపగుత్తగా ఓట్లు వేస్తారని ఆశించిన వారి ఆశలు అడియాసలే అయ్యాయి. రుణమాఫీ అంశం చెప్పినమాట ప్రకారం చేశాం మాకు ఓట్లు వేయండి అని అడగడానికి లేకుండా పోయింది. ఏతావాతా ఎమ్మెల్యే అభ్యర్థుల భవితవ్యం నడిసముద్రంలో నావాలాగా అయిపోయింది.
టీడీపీకి ఇది మాయని మచ్చ..
తెలుగుదేశం ప్రభుత్వానికి ఇది మాయని మచ్చగా నిలిచిపోనుంది. ఎన్నికల ముందు సంపూర్ణ రుణమాఫీ అని ప్రకటించిన ఆ పార్టీ.. ఆ తరువాత అనేక రకాల కొర్రీలు వేసినా లక్షన్నర వరకూ అయినా ప్రయోజనం కలుగుతుంది అనుకున్నారు. వాటిని కూడా 5 విడతలుగా ఇస్తామని ప్రకటించారు. మూడు దఫాలు ఇచ్చినా చివరి రెండు దఫాలు ఇంకా పెండింగ్లోనే ఉంది. ప్రస్తుతం ఖజనా అంతా ఇప్పటికే ఖాళీ అయిపోయింది. ఇక వచ్చేవి కూడా ఇప్పట్లో లేకపోవడంతో ప్రభుత్వానికి దిక్కుతోచని పరిస్థితి అయిపోయింది.
ఈనెల కేంద్రం నుంచి రావలసిన జీఎస్టీ సొమ్ములు అంతా వచ్చిన వెంటనే ఉద్యోగుల జీతాలు, డ్వాక్రా, అన్నదాతా సుఖీభవ తదితర వాటికి పూర్తిగా సర్దేశారు. ఇప్పుడు ఖజానా ఖాళీగా ఉన్న సమయంలో చంద్రబాబు ఖచ్చితంగా 8వతేదీ కంతా రైతుల ఖాతాల్లో డబ్బులు పడతాయి తీసుకోండి అని చెప్పారు. తీరా రైతులు బ్యాంకుల వద్దకు వెళితే అలాంటిది ఏమిలేదని సెలవిస్తున్నారు. కొన్ని బ్యాంకులు ఈ తాకిడిని తట్టుకోలేక బయట బోర్డులు కూడా పెడుతున్నాయట. రైతులకు సంబంధించి ఎలాంటి డబ్బులు తమకు జమకాలేదని దయజేసి రైతులు ఎవ్వరూ కూడా బ్యాంకు వద్దకు రావద్దని బోర్డులు పెడుతున్నారు.
ఆచరణ సాధ్యం కానీ హామీ అని జగన్ ఆ హామీని ఇవ్వలేకపోయాడు. నేను చేసి చూపిస్తా అని చంద్రబాబు బీరాలకు పోవడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం అయిపోయింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఇచ్చిన ప్రధానా హామీలో రుణమాఫీ ఆచరణ కానీ హామీగా మిగిలిపోనుంది. ఇది ఎన్నటికీ అధికార పార్టీకి మాయని మచ్చలాగే మిగిలిపోనుంది. ఇక ప్రచార పర్వం కూడా నిన్నటితో ముగిసిపోవడంతో.. జనం నాడి ఎటు మొగ్గుతుంతో వేచి చూడాలి.
515641 821610Hi there! Good stuff, please do tell me when you lastly post something like this! 929836
461488 557444you use a great blog here! do you wish to have the invite posts in my small weblog? 157014