తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకు వచ్చిన దరణి పోర్టల్ ను ఉపయోగించి కొందరు అక్రమార్కులు మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా కర్ణాటకకు చెందిన ఇద్దరు యువకులు ధరణి తెలంగాణ ల్యాండ్ రికార్డ్స్ అంటూ ఒక యాప్ ను తీసుకు వచ్చారు. ఆ యాప్ గూగుల్ ప్లే స్టోర్ లో వారు ఉంచారు. అధికారిక యాప్ అయ్యి ఉంటుందని చాలా మంది దాన్ని డౌన్ లోడ్ చేసుకున్నారు.
కాని ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి అధికారులు అధికారికంగా యాప్ను విడుదల చేయకపోవడంతో కొందరికి అనుమానం వచ్చింది. ఈ విషయం తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ దృష్టికి రావడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణ పోర్టల్కు వారు తయారు చేసిన యాప్ ను లింక్ చేశారు. అంతే తప్ప వారు డేటాను తస్కరించడం కాని మరేం చేయలేదు. వారు ఏ ఉద్దేశ్యంతో ఈ యాప్ను చేశారు అనే విషయాన్న తెలుసుకునేందుకు పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నారు.
745139 415108Wow, superb weblog structure! How long have you been blogging for? you make blogging glance straightforward. The total look of your internet website is superb, neatly as the content material! 409008