Switch to English

ఎమ్మెల్యే పదవికి ఈటెల రాజీనామా.. కండిషన్స్ అప్లయ్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

‘కారు గుర్తు మీద గెలిచావ్ కదా.. రాజీనామా చెయ్.. అని తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు నన్ను డిమాండ్ చేయొచ్చు. నేను రాజీనామా చెయ్యాలి కూడా.. చేస్తాను, ఖచ్చితంగా రాజీనామా చేస్తాను. కానీ, అంతకన్నా ముందు నన్ను ఇరవయ్యేళ్ళుగా ఆశీర్వదిస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల ముందుకు వెళ్ళాలి.. వారి అభిప్రాయాలు తెలుసుకోవాలి.. ఆ తర్వాతే ఏం చేయాలన్నదానిపై నిర్ణయం తీసుకుంటాను..’ అంటూ ఎమ్మెల్యే పదవికి రాజీనామాపై మాజీ మంత్రి ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు.

తనపై ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయంగా వేటు వేసిన దరిమిలా, ఈటెల రాజేందర్ మీడియా ముందుకొచ్చి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్, గతంలో ఎప్పుడూ డబ్బు కోసం రాజకీయాలు చేయలేదనీ, ఇప్పుడు పరిస్థితి మారిందని అన్నారు. కేసీఆర్ శిష్యరికంలో నేనెప్పుడూ డబ్బు కోసం రాజకీయాలు చేయాలనుకోలేదన్నారు. కేసీఆర్లో కారుణ్యం చూశాను తప్ప, కాఠిన్యం చూడలేదు, ఇప్పుడు చూస్తున్నాను.. అంటూ కంటతడిపెట్టినంత పనిచేశారు ఈటెల రాజేందర్.

రాజకీయంగా భవిష్యత్ కార్యాచరణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న ఈటెల రాజేందర్, రాజకీయాల్లోకి వచ్చింది ప్రజల కోసమేనని స్పష్టం చేశారు. పదవుల కోసం ఏనాడూ పాకులాడలేదన్న ఈటెల రాజేందర్, తన తండ్రి మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి అనీ, తానిప్పుడు తిరిగి ఆ మధ్యతరగతి జీవితం సైతం గడపడానికి సిద్ధమేనని తేల్చి చెప్పారు. ‘న్యాయపోరాటం ఖచ్చితంగా చేస్తా..’ అంటూ ఈటెల రాజేందర్ చెప్పుకొచ్చారు.

‘ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధికారులు రిపోర్ట్ ఇచ్చారు.. ఆ రిపోర్టులో అన్నీ తప్పుల తడకలే..’ అంటూ భూ కబ్జా వ్యవహారంపై ఈటెల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులెవరూ ఆత్మ సంతృప్తితో పనిచేసే పరిస్థితి తెలంగాణ రాష్ట్ర సమితిలో లేదనీ, ఆ విషయాన్ని తాను కుండబద్దలుగొట్టినందుకే ఈ పరిస్థితి వచ్చిందని ఈటెల చెప్పుకొచ్చారు. పదవులు లేకపోయినా, ప్రజల కోసం ధైర్యంగా పోరాడాలని నేర్పిన గురువు కేసీఆర్ అనీ, ఆ బాటలోనే తాను తన రాజకీయ భవిష్యత్తుపై ముందడుగు వేస్తానని ఈటెల వ్యాఖ్యానించడం చూస్తుటే, ఈటెల కొత్త రాజకీయ పార్టీ పెడతారన్న ఊహాగానాలకు బలం చేకూరుతోంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

రాజకీయం

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎక్కువ చదివినవి

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...