భార్య భర్తల మధ్య తలెత్తిన సమస్యతో భార్య పుట్టింట్లోనే ఉండిపోయింది. ఆ సమస్య ఆమెను వేధించిందో ఏమో ఆమె ప్రవర్తనకు కన్న తల్లిదండ్రులు అవాక్కయ్యారు. కూతురి చేతిలో చావు తప్పించుకున్నారు. ఈ సంఘటన నెల్లూరు జిల్లాలో ఈనెల 10వ తేదీన జరిగింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనపై వివరాలు ఇలా ఉన్నాయి..
నెల్లూరు నగరంలోని బాలాజీనగర్ పీఎస్ పరిధిలో రాయపుపాలెంలో జేమ్స్ పాల్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. ఈయనకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెద్దమ్మాయికి మూడేళ్ల క్రితం వివాహం చేశాడు. కానీ.. మూడేళ్లుగా పుట్టింట్లోనే ఉంటోంది. అయితే.. ఈనెల 10న రోజూలానే అందరూ ఇంట్లో నిద్రించారు. మధ్య రాత్రిలో అందరూ నిద్రలో ఉండగా పాల్ పెద్ద కుమార్తె తన తల్లిదండ్రులపై వేడి నీళ్లు, నూనెను వారిపై పోసేసింది.
తేరుకుని ఏం జరిగిందో తెలుసుకునేలోపే వారి ఒళ్లు కాలిపోయింది. వెంటనే పాల్ అతని భార్య ప్రాణ భయంతో అరుచుకుంటూ బయటకు పరుగు తీశారు. కుమార్తె మాత్రం వారిపై కారం కూడా చల్లాలని ప్రయత్నించి వారిని వెంబడించింది. పాల్ దంపతుల కేకలతో చుట్టుపక్కల వాళ్లు మేల్కొని వారిద్దరినీ వెంటనే ఆస్పత్రికి తరలించారు.
పాల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే.. కూతురు ఇలా ఎందుకు ప్రవర్తించిందో మాత్రం వారు చెప్పలేకపోతున్నారు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
284964 886419An fascinating dialogue is value comment. I feel that its greatest to write extra on this matter, it might not be a taboo topic however normally folks are not enough to speak on such topics. Towards the next. Cheers 84670
830185 820309I adore gathering valuable information, this post has got me even much more information! . 585595
663295 440300Oh my goodness! an outstanding article dude. Thank you However Im experiencing dilemma with ur rss . Do not know why Cannot register for it. Could there be any person getting identical rss difficulty? Anybody who knows kindly respond. Thnkx 804507