అమెరికాలోని ఓక్లాహామాలో దారుణం జరిగింది. చికాషా ప్రాంతంకు చెందిన లారెన్స్ పాల్ అండర్సన్ అనే వ్యక్తి ఒంటరిగా ఉండే ఒక మహిళను ఈనెల 9వ తారీకున చంపేశాడు. ఆమెను చంపడమే కాకుండా ఆమె శరీరం నుండి గుండెను వేరు చేసి తన ఇంటికి తీసుకు వచ్చాడు. ఆ గుండెను ఆలు గడ్డలతో కలిపి వంట చేశారు. అత్తా మామలతో ఉంటున్న లారెన్స్ పాల్ ఆ కూరను వారికి వడ్డించాడు. వారు తినేందుకు ఒప్పుకోక పోవడంతో ఆగ్రహంతో రగిలి పోయాడు. అమ్మా మామలు మరియు వారి మనమురాలితో సహా ఆ కూర తినడం లేదని కోపంతో కత్తితో దాడి చేశాడు.
కత్తి దాడిలో మామ మరియు వారి మనమరాలు మృతి చెందగా పాల్ అత్త మాత్రం తీవ్ర గాయాలతో అక్కడ నుండి పారిపోయింది. విషయం స్థానికులకు చెప్పడంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి ఎంక్వౌరీ చేసిన పోలీసులు విస్తు పోయే విషయాలను తెలుసుకున్నారు. అతడికి గతంలోనే నేర చరిత్ర ఉంది. 20 ఏళ్ల జైలు శిక్ష పడ్డ అతడు క్షమా బిక్షతో బయటకు వచ్చాడు. ఇప్పుడు మళ్లీ హత్యలు చేశాడు. తన అత్తా మామలను దెయ్యాల నుండి కాపాడే ఉద్దేశ్యంతోనే మహిళను చంపి ఆమె గుండెతో కూర చేశాను. వారు దాన్ని తినక పోవడం వల్ల కోపం వచ్చి వారిని చంపాలనుకున్నాను అంటూ పోలీసుల విచారణలో తెలియజేశాడు.
490197 163633Overall, politicians are split on the issue of whether Twitter is much more for business or personal use. The very first thing is the fact which you can build up quite a large following of people. 152410
109759 109672You ought to experience a contest personally with the finest blogs on-line. Im going to suggest this page! 73144