బడ్జెట్ స్పీచ్ అనంతరం బయటకు వెళ్తున్న హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దాడి చేశారు. గవర్నర్ తన వాహనం వద్దకు వెళుతున్నప్పుడు ఈ ఘటన జరిగింది. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈ నెల 22న ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని తీర్మానం ప్రవేశపెట్టారు. వీరిలో ప్రతిపక్ష నాయకుడు ముఖేష్ అగ్నిహోత్రి, ఎమ్మెల్యేలు ఉన్నారు. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేశారు.
దీంతో గవర్నర్ తన ప్రసంగంలోని చివరి లైన్లను మాత్రమే చదివి ప్రసంగం మొత్తం చదివినట్లు భావించాలన్నారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేసారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదల అంశాన్ని ప్రసంగంలో చేర్చకపోవడాన్ని వారు తప్పుబట్టారు. అనంతరం తన కారు దగ్గరకు దత్తాత్రేయ వెళ్తుండగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై సీఎం జై రామ్ ఠాకూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్పై దాడి చేసిన ఎమ్మెల్యేలను మార్చి 20 వరకు సస్పెండ్ చేశారు.
844352 252799Hi there! Nice post! Please do inform us when we could see a follow up! 341834
863979 434603I got what you intend, saved to favorites , extremely decent internet website . 807686
30550 55743The Case For HIIT Cardio – Why You need to Concider it By the way you may want to take a look at this cool internet site I found 406784