ఏపీ ప్రధాన ఎన్నికల కమీషనర్ గా నిన్న నిమ్మగడ్డ రమేష్ రిటైర్ అయిన నేపథ్యంలో ప్రభుత్వం ఆయన స్థానంలో నీలం సాహ్నిని నియమించిన విషయం తెల్సిందే. ఆమె నేడు ఏఈసీగా బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని ఎన్నికల కమీషనర్ ఆఫీస్ లో ప్రభుత్వ గౌరవ మర్యాదల మద్య ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఏపీ తొలి సీఎస్ గా ఆమె గుర్తింపు దక్కించుకున్నారు. ఎస్ఈసీగా పదవి బాధ్యతలు చేపట్టిన సాహ్నికి గవర్నర్ అభినందనలు తెలియజేశారు.
కమీషన్ కార్యదర్శి అయిన కన్న బాబు మరియు ఎలక్షన్ కమీషన్ అధికారులు నీలం సాహ్నికి స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన సాహ్ని మొదటగా రాష్ట్రంలో జరగాల్సిన పరిషత్ ఎన్నికలకు సంబంధించిన నిర్ణయం తీసుకోబోతున్నారు. నిమ్మగడ్డ ఆధ్వర్యంలోనే ఎన్నికల నోటిఫికేషన్ రావాల్సి ఉన్నా కూడా ఆయన తాను నిర్వహించలేను అంటూ చేతులు ఎత్తేశారు. తన విధి నిర్వహనలో ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాను అంటూ ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.
493829 799941Finally, got what I was searching for!! Ive genuinely enjoying every small bit of this. Ecstatic I stumbled into this post! and also Ive bookmarked to appear at unique information for your weblog post. 846365