Switch to English

పోలవరంపై సీఎం జగన్ సమీక్ష: ‘తగ్గింపు’ నిజమేనా.? కాదా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

పోలవరం ప్రాజెక్టు విషయంలో గత కొంతకాలంగా జరుగుతున్న రాద్ధాంతం అంతా ఇంతా కాదు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కేంద్రం ఇవ్వాల్సిన నిధులపై స్పష్టత రావడంలేదు. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్ళ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టుకి పూర్తిస్థాయిలో కేంద్రం నిథులు ఇవ్వగలుగుతుందా.? కేంద్రం నిధులు ఇవ్వకపోతే, రాష్ట్రం పోలవరం ప్రాజెక్టుని భరించగలదా.? అన్న ప్రశ్నలు తెరపైకి రావడం సహజమే.

అయితే, కేంద్రం మొదటి నుంచీ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి నిధుల విషయమై కొర్రీలు పెడుతూనే వుంది. పోలవరం ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం విషయమై కేంద్రం రెండో ఆలోచన చేస్తోందనీ, రాష్ట్రం సైతం ఈ విషయంలో కేంద్రానికి మద్దతిచ్చేలా వుందనీ ప్రచారం జరుగుతోంది. వీటికి తోడు, పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తామని జగన్ తనకు చెప్పారంటూ గతంలో కేసీఆర్ ప్రకటించేసుకున్నారు. ఎత్తు తగ్గించడం ద్వారా నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతుంది.. తద్వారా ముంపు ప్రాంతమూ తగ్గుతుంది. ఆ లెక్కన ఖర్చు చేయాల్సిన నిధులు కూడా తగ్గుతాయి. ఇన్ని అనుకూలతల నేపథ్యంలో కేంద్రం – రాష్టం ఓ అవగాహనకు వచ్చి, అసలు ప్రాజెక్టు లక్ష్యాన్ని నీరుగార్చుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఈ మధ్యనే నిల్వ సామర్థ్యం తగ్గింపు గురించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుందంటూ మీడియాలో వచ్చిన కథనాల నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, పోలవరం ప్రాజెక్టుపై తాజాగా సమీక్ష నిర్వహించారు. చిత్రమేంటంటే, ‘అసలు ఎత్తు తగ్గింపు అనే చర్చకు ఆస్కారమే లేదు. ఇదంతా దుష్ప్రచారం..’ అని అధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కి తేల్చి చెప్పడం.

మీడియాలో ఓ వర్గం.. అంటే, టీడీపీ అనుకూల మీడియా జగన్ సర్కారుకీ, మోడీ సర్కారుకీ వ్యతిరేకంగా కథనాలు వండి వడ్డించడం అనేది సర్వసాధారణమైన విషయమే. కానీ, ప్రాజెక్టుపై జరుగుతున్న దుష్పచారం నేపథ్యంలో అటు కేంద్రం, ఇటు రాష్ట్రం.. ప్రజలకు భరోసా ఇవ్వాలి. జాతీయ ప్రాజెక్టు గనుక, ఆ జాతీయ ప్రాజెక్టుని కేంద్రం పర్యవేక్షిస్తున్నా.. రాష్ట్రమే నిర్మాణ పనులు చేస్తున్న దరిమిలా.. ఈ తరహా అనుమానాలకు ఆస్కారం లేకుండా చేయాల్సిన బాధ్యత అటు కేంద్రానిదీ, ఇటు రాష్ట్రానిదీ అవుతుంది.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...