ఐపీఎల్ 2020 మ్యాచ్ లు రసవత్తరంగా జరుగుతున్నాయి. భారీ అంచానాలు ఉన్న టీమ్ లు గ్రౌండ్ లో చతికిలపడుతుంటే అంచనాలు లేకుండా వచ్చిన జట్లు సంచలనాలు నమోదు చేస్తున్నాయి. ఈకోవలోకే కింగ్స్ ఎలవెన్ పంజాబ్ జట్టు కూడా ఉంది. టీమ్ పరంగా బలంగా ఉన్నా ఆటలో విఫలమైంది. ఇప్పటివరకూ ఏడు మ్యాచ్ ల్లో ఆరింటిని కోల్పోయి పాయింట్ల పరంగా అట్టడుగున ఉంది. ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ మ్యాక్స్ వెల్ సరిగా రాణించకపోవడమే ఇందుకు కారణమని అభిమానులు అంటున్నారు.
అయితే.. శనివారం నాటి మ్యాచ్ లో మ్యాక్స్ వెల్ కు బదులుగా వెస్టిండీస్ స్టార్ క్రికెటర్.. విధ్వంసకర బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్ ను ఆడించాలని భావించింది. కానీ.. ఫుడ్ పాయిజన్ కారణంగా గేల్ ఆడలేకపోయాడు. కోచ్ కుంబ్లే కూడా ఇదే అభిప్రాయాన్ని చెప్పాడు. హైదరాబాద్ మ్యాచ్ లోనే గేల్ ను ఆడించాలని భావించామన్నాడు. ప్రస్తుతం అనారోగ్యంతో గేల్ ఉన్నాడని అన్నారు. కింగ్స్ ఎలెవన్ వరుస వైఫల్యాల నేపథ్యంలో క్రిస్ గేల్ తన ఇన్ స్టా అకౌంట్లో స్పందించాడు. తాను హాస్పిటల్ లో ఉన్న ఫొటోను షేర్ చేశాడు.
‘ప్రస్తుతం నా పరిస్థితి ఇది. అనారోగ్యం నుంచి కోలుకోలేకుండా ఆడలేను. ఎంత క్రికెట్ లో బాస్ అయినా పరిస్థితుల నుంచి తప్పించుకోలేం. ఇలా ఉన్నా నా స్టైల్ ను మిస్ కాను’ అంటూ తన వాల్ లో రాసుకున్నాడు. వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం లారా కూడా గేల్ ఆడకపోవడంపై విచారం వ్యక్తం చేశాడు.
366654 783597I enjoy reading article. Hope i can find much more articles like this one. Thanks for posting. 1775
825012 986628In todays news reporting clever journalists function their very own slant into a story. Bloggers use it promote their works and a lot of just use it for enjoyable or to stay in touch with friends far away. 593756