Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) కి ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులో ఊరట లభించింది. 2014 ఎన్నికల సమయంలో ఆయన పై నమోదైన కేసును ఇవాళ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది.
అప్పటి సార్వత్రిక ఎన్నికల సమయంలో చిరంజీవి కాంగ్రెస్ తరపున ప్రచారం చేశారు. ఇందులో భాగంగా గుంటూరులో ప్రచారం నిర్వహించగా అనుమతి ఇచ్చిన నిర్ణీత సమయంలో మీటింగ్ పూర్తి చేయనందున భారీ ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయని అప్పుడు ఆయనపై కేసు నమోదు చేశారు.
అయితే ఈ కేసును కొట్టివేయాలంటూ గతంలో చిరంజీవి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఆ కేసు ఈరోజు విచారణకి రాగా.. ప్రాసిక్యూషన్ దీనిని నిరూపించలేకపోయింది. దీంతో కేసును కొట్టి వేస్తున్నట్టు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ప్రకటించింది. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తరపున స్టార్ క్యాంపైనర్ గా చిరంజీవి ప్రచారం చేసిన విషయం తెలిసిందే.