Chiranjeevi: ‘అవార్డులనేవి కళాకారులకు ప్రోత్సాహాన్నిస్తాయి. గతంలో ఇచ్చే నంది అవార్డులు కొన్నేళ్లుగా ఆగిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ వాటిని పునరుద్దరిస్తూ శ్రామిక కళాకారుడు ‘గద్దర్’ గారి పేరుsy అవార్డులు ఇస్తామనడం ముదావహం.. ఎంతో సంతోషించే విషయం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారికి నా ధన్యవాదాల’ని చిరంజీవి అన్నారు.
విద్యార్ధి దశ నుంచీ వెంకయ్యనాయుడుగారిని చూస్తున్నా. ఆయన వాగ్దాటికి నేను అభిమానిని. ఆయన నాకో ఇన్ స్పిరేషన్. రాజకీయాల్లో హుందాతనం.. తెలుగుదనానికి నిలువెత్తు రూపం తీసుకొచ్చిన ప్రముఖులు. దేశానికి ఎంతో సేవ చేసిన ఆయనకు పురస్కారం వరించడం నాకు చాలా ఆనందంగా ఉంది.
ముందుగా పద్మవిభూషణ్ కాకుండా.. పద్మశ్రీ అవార్డులు ప్రకటించి గంట విరామం ఇవ్వడానికి గల కారణాన్ని వెంకయ్యనాయుడుగారు చెప్పినప్పుడు ఆశ్చర్యం అనిపించింది. కళాకారులకు పద్మశ్రీ ప్రకటించడం ద్వారా ముందుగా ప్రజల్లోకి వెళ్లి వారి గురించి చర్చ జరిగి వారిని వెలుగులోకి తీసుకురావలని ప్రధాని మోదీగారు ఆలోచన చేశారని తెలిసి ఎంతో సంతోషించాను. దీంతో ఆయనపై నాకు మరింత గౌరవం పెరిగింద’ని అన్నారు.