Switch to English

నో డౌట్‌.. ఇంటి పెద్దన్న వద్ద ‘పంచాయితీ’ తప్పదుగానీ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఇంట్లో ఓ సమస్య వస్తే ఏం చేస్తాం.? ఇంటి పెద్ద వద్దనే పంచాయితీ పెడతాం. తమ ప్రభుత్వ నిర్ణయాల్ని హైకోర్టు తీవ్రంగా వ్యతిరేకిస్తోంది గనుక.. ‘పంచాయితీ’ సుప్రీంకోర్టులో పెట్టింది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌కి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తుల మీదా, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ మీదా ఫిర్యాదు చేసిన విషయం విదితమే. ఈ విషయమై న్యాయ నిపుణుల నుంచి రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ అనుకూల మీడియా ఒకలా, వైసీపీ అనుకూల మీడియా ఇంకొకలా.. న్యాయ కోవిదుల నుంచి ‘అభిప్రాయాల్ని రాబడుతున్నాయి’.!

భిన్నత్వంలో ఏకత్వం.. అనేది మన ప్రజాస్వామ్యం తాలూకు గొప్పతనం. కానీ, ఇక్కడ.. పరిస్థితి వేరు. ఎవరికి తోచిన అర్థంలో వారు మాట్లాడుకుంటున్నారు. న్యాయ కోవిదులూ ఇందుకు అతీతమేమీ కాదు. ఫలానా న్యాయ కోవిదుడు ఇలా అభిప్రాయపడ్డాడు.. అని ఓ వార్త వస్తే, దానికి పూర్తి వ్యతిరేకంగా.. ఫలానా న్యాయ కోవిదుడు ఇలా చెప్పాడు.. అంటూ ఇంకో వార్త వస్తోంది. ఏది నిజం.? అంటే, ఆ పంచాయితీ ఇప్పట్లో తేలేది కాదు.

సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌, ఈ వ్యవహారంపై నిర్ణయం తీసుకుంటే తప్ప, ఎవరిది తప్పన్నది తేలేలా కనిపించడంలేదు. ఈలోగా, న్యాయ వ్యవస్థపై వీలైనంత ఎక్కువ బురద చల్లేస్తున్నాయి మీడియా సంస్థలు, రాజకీయ పార్టీలు. ‘సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయినా.. ఆయన కూడా ఓ మనిషే కదా.. ఆయన మీదా రాజకీయ ప్రభావాలు వుంటాయి కదా..’ అన్నది ఓ వాదన. ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్‌ ఎన్వీ రమణ మాత్రం, ‘ఒత్తిళ్ళను తట్టుకుని ధైర్యంగా నిలబడాలి..’ అంటూ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు ఓ కార్యక్రమంలో.

ఓ కోర్టు తీర్పుని ఇంకో కోర్టులో సవాల్‌ చేసే అవకాశం వున్నప్పుడు, కింది కోర్టుల తీర్పుల్ని పైకోర్టులు కొట్టివేసిన సందర్భాలు చాలానే వున్నప్పుడు, న్యాయ వ్యవస్థపై రాజకీయ పంచాయితీ అర్థమేముంది.? అన్నది మెజార్టీ న్యాయ కోవిదుల అభిప్రాయం. ఏ కేసులో అయినా తీర్పు కొందరికి నచ్చకపోవడం సర్వసాధారణం. అలాగని, న్యాయవ్యవస్థనే తప్పుపడుతూ పోతే ఎలా.? పంచాయితీ తీర్చాల్సింది ఇంటి పెద్ద.. అదే సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ బాబ్డే. కానీ, అక్కడిదాకా ఈ వ్యవహారం వెళ్ళడం అవసరమా.? అన్నదే మిలియన్‌ డాలర్ల ప్రశ్న. ఇకపై, ప్రతి చిన్న కేసులోనూ సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌కే ఫిర్యాదులు చేసుకుంటూ పోతే.. న్యాయవ్యవస్థ ఆ ఒత్తిడిని తట్టుకోగలదా.?

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

రాజకీయం

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎక్కువ చదివినవి

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...