ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారనేది సామెత. అచ్చం అదే తరహాలో ఇప్పుడు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు రూపొందించిన నిబంధనే ఆయనకు ఇబ్బందిగా పరిణమించింది. ఉండవల్లిలోని ఆయన నివాసాన్ని కూల్చివేసేందుకు శాయశక్తులా కృషి చేస్తున్న జగన్ సర్కారు.. ఆ నిబంధననే ఆయుదంగా మలుచుకుంది. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ రాజధాని నిర్మాణ వ్యవహారాలు చూడటం కోసం ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (ఏపీ సీఆర్డీఏ)ను ఏర్పాటు చేసింది.
అందుకు సంబంధించి ఏపీసీఆర్డీఏ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించింది. దీనికి అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్ సీపీ సైతం మద్దతు తెలిపింది. ఇప్పుడు అదే సంస్థ చంద్రబాబు నివసిస్తున్న ఇల్లు అక్రమ కట్టడమని, వారం రోజుల్లో కూల్చివేయకుండా తామే కూల్చివేస్తామంటూ శనివారం తుది నోటీసులు జారీ చేసింది. ముఖ్యంగా ఏపీసీఆర్డీఏ చట్టంలోని సెక్షన్ 115(1), 115(2) నిబంధన కిందే బాబు నివాసం కూల్చేవేతకు నోటీసులు జారీ చేశారు.
అక్రమ నిర్మాణాలను కూల్చివేసే అధికారాన్ని ఏపీ సీఆర్డీఏకి కట్టబెట్టేందుకు అప్పట్లో ఈ నిబంధనను పొందుపరిచారు. ఇప్పుడు అదే నిబంధన కింద ఏపీ సీఆర్డీఏ ఆయన నివాస యజమాని లింగమనేని రమేశ్ కు నోటీసులిచ్చింది. ఈ నోటీసులు జారీచేసే ముందు న్యాయ పరమైన సలహా కూడా తీసుకుంది. బాబు ఉంటున్న నివాసాన్ని కూల్చివేయడానికి సన్నద్ధమైన సర్కారు.. న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకూడదనే ఉద్దేశంతో పకడ్బందీగా వ్యవహరిస్తోంది.
తన నివాసానికి, స్విమ్మింగ్ పూల్ కి అన్ని రకాల అనుమతులు ఉన్నాయని చెబుతున్న రమేశ్.. వాటిని సమర్పించడానికి కొంతకాలం గడువు కోరారు. అయితే, గడువు ముగిసినా ఆయన ఎలాంటి డాక్యుమెంట్లు సమర్పించలేదు. ఈ నేపథ్యంలోనే ఏపీసీఆర్డీఏ ముందుకెళుతోంది. నోటీసులను కూడా పక్కాగా తయారుచేసింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆ ఇంటిని ఖాళీ చేసి మరో ఇంటికి వెళ్లడం తప్పేలా కనిపించడంలేదు.
435870 511739I feel this web website has got extremely amazing indited written content material articles . 915210
724015 472407really good put up, i really really like this web website, maintain on it 302545