అదేంటి..? జగన్ పేరు వింటేనే అంతెత్తున మండిపడే చంద్రబాబు ఆయన బాటలో వెళ్లడం ఏమిటా అని అనుకుంటున్నారా? రాజకీయాల్లో అంతే మరి. అధికారం చేజిక్కించుకోవాలంటే బోలెడు ఫీట్లు చేయాల్సిందే. అనుక్షణం ప్రత్యర్థులు వ్యూహాలను తెలుసుకుని అంతకుమించిన ఎత్తులతో వాటిని చిత్తు చేస్తేనే అధికారం అందలం ఎక్కిస్తుంది. 2014 ఎన్నికల్లో తృటిలో అధికారం చేజార్చుకున్ జగన్.. అనంతరం వ్యూహాత్మకంగా వ్యవహరించారు. పథకాలు, ప్రచారం విషయంలో బాగా వెనకబడ్డామనే విషయాన్ని గుర్తించి ఆ మేరకు దృష్టి సారించారు.
ఎన్నికల వ్యూహకర్తగా మంచి పేరున్న ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐప్యాక్) అధినేత ప్రశాంత్ కిషోర్ సేవలను వినియోగించుకున్నారు. ఆయనకు దాదాపు రూ.300 కోట్ల మేరకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అప్పట్లో జగన్ నిర్ణయాన్ని అందరూ విమర్శించారు. కానీ జగన్ తీసుకున్న ఆ నిర్ణయం ఆయనకు అధికారం తీసుకురావడానికి దోహదపడింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. పథకాల రూపకల్పన దగ్గర నుంచి ప్రచారాన్ని విస్తృతంగా చేయడంలోనూ, నియోజకవర్గాల వారీగా ఫీడ్ బ్యాక్ ను తెప్పించుకుని విశ్లేషణ చేయడంలోనూ పీకే టీం అదరగొట్టింది. చంద్రబాబు తన అనుభవాన్ని, అనుకూల మీడియానే నమ్ముకున్నారు.
చివరి నిమిషంలో ప్రకటించిన పథకాలు తనకు ఓట్లు తెచ్చి పెడతాయని భావించారు. కానీ కథ అడ్డం తిరిగింది. బాబును చిత్తుగా ఓడించిన జనం.. జగన్ కు అధికారం కట్టబెట్టారు. ఈ నేపథ్యంలో బాబు కూడా జగన్ బాటే పట్టారు. తాను కూడా ఓ ఎన్నికల వ్యూహకర్తను నియమించుకున్నారు. ఐప్యాక్ లో గతంలో పని చేసిన రాబిన్ శర్మ అనే వ్యక్తిని చంద్రబాబు ఇందుకు నియమించుకున్నట్టు సమాచారం. రూ.50 కోట్లకు ఒప్పందం కుదిరిందని తెలుస్తోంది.
ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉండగా పీకే బృందాన్ని జగన్ నియమించుకోగా.. చంద్రబాబు మాత్రం ఏకంగా ఐదేళ్ల ముందే వ్యూహకర్తను నియమించుకోవడం విశేషం. నిర్ణీత షెడ్యూల్ కంటే రెండేళ్ల ముందే జమిలి ఎన్నికలు జరిగే అవకాశం ఉందనే సంకేతాల నేపథ్యంలో బాబు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అప్పట్లో పీకేను జగన్ నియమించుకున్నప్పుడు ఎద్దేవా చేసిన టీడీపీ నేతలు.. ఇప్పుడు ఏమంటారో చూడాలి.
111824 373731Hi my friend! I want to say that this post is awesome, nice written and consist of almost all significant infos. Id like to see much more posts like this . 159197
228935 549405quite good post, i undoubtedly adore this remarkable website, carry on it 414263