Switch to English

ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయి: చంద్రబాబు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,422FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయని తమకు అనుమానంగా ఉందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో పలుచోట్ల ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగి ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణలో కేంద్ర ఎన్నికల సంఘం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. చంద్రబాబు శనివారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ ఆరోరాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరిగిన పోలింగ్ తీరుపై అసంతృప్తి వ్యక్తంచేశారు. ఏపీలో పోలింగ్ జరిగిన తీరు, ఈవీఎంల మొరాయింపు, అర్ధరాత్రి వరకు పోలింగ్ జరగడం వంటి విషయాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈసీ వైఖరిని తూర్పారబట్టారు. ఏపీ చరిత్రలోనే ఇలాంటి అరాచకాలను ఎన్నడూ చూడలేదన్నారు. ఎన్నికల సంఘం పూర్తిగా ప్రధాని మోదీ చెప్పినట్టే పనిచేస్తోందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఈసీ తనకు ఇష్టం వచ్చినట్టు అధికారులను బదిలీ చేసుకుంటూ వెళ్లిందని విమర్శించారు. వైఎస్సార్ సీపీ తప్పుడు ఫిర్యాదులను ఆధారంగా తీసుకుని కనీసం విచారణ కూడా జరిపించకుండా అధికారులను బదిలీ చేశారని ధ్వజమెత్తారు.

సీఎస్ ను ఇష్టానుసారం బదిలీ చేసి, జగన్ కేసులో సహ నిందితుడిగా ఉన్న వ్యక్తిని ఆ స్థానంలో నియమించారని, అసలు ఈ దేశం ఎక్కడికి పోతోందని ప్రశ్నించారు. ఈవీఎంలు పనిచేయని కారణంగా ఓటర్లు ఉదయం నుంచి తిండి, నీళ్లు లేకుండా లైన్లో ఉండాల్సి వచ్చిందని చెప్పారు. చాలాచోట్ల మధ్యాహ్నం ఒంటిగంటకు కూడా పోలింగ్ ప్రారంభం కాలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చాలామంది ఓటర్లు వెనుతిరిగి వెళ్లిపోయారని, దాంతో తాను ఓటేయాల్సిందిగా పిలుపునిస్తే.. మళ్లీ మధ్యాహ్నం 3 గంటల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు ఓటరు కేంద్రాలకు చేరుకున్నారని తెలిపారు. అది వారి కమిట్ మెంట్ అని, కానీ ఈసీ మాత్రం ఎన్నికల నిర్వహణలో ఘోరంగా విఫలమై, ప్రజల ఇబ్బందులకు కారణమైందని దుయ్యబట్టారు.

కొన్నిచోట్ల తెల్లవారేవరకు పోలింగ్ కొనసాగిందంటే ఇదేం ప్రజాస్వామ్యం అని ప్రశ్నించారు. రాష్ట్రానికి అవసరమైన మేర పోలీసు బలగాలను కూడా పంపకపోవడంతో రౌడీలు రాజ్యమేలారన్నారు. ఎక్కడిక్కడ దాడులకు తెగబడ్డారని, ఎమ్మెల్యే అభ్యర్థులతోపాటు స్పీకర్ పై కూడా దాడి చేశారని వివరించారు. ఎన్నికల్లో హింస చెలరేగి హత్యలు జరిగినా, మహిళలపై దాడి జరిగినా ఈసీ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఫలితంగా రాష్ట్రం రావణకాష్టంలా మారి, ప్రజాజీవనం స్తంభించిపోయిందన్నారు. ఈవీఎంల వినియోగంపై తాము మొదటి నుంచి పోరాడుతూనే ఉన్నామని గుర్తుచేశారు.

బ్యాలెట్ పేపర్ తో ఎన్నికలు నిర్వహిస్తే ఇలాంటి సమస్యలు ఉండవన్నారు. ప్రపంచంలోని చాలా దేశాలు బ్యాలెట్ పేపర్ వినియోగిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ఈవీఎంల విధానాలపై అందరికీ సందేహాలు ఉన్నాయని, అందువల్లే బ్యాలెట్ పేపర్ తో ఎన్నికలు నిర్వహించాలని తాము కోరుతున్నట్టు చెప్పారు.

వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించడానికి ఆరు రోజుల సమయం పడుతుందని సుప్రీంకోర్టుకు ఈసీ తప్పుడు సమాచారం ఇచ్చిందని దుయ్యబట్టారు. బ్యాలెట్ పేపర్లు లెక్కించడానికి 16 గంటల సమయం పట్టినప్పుడు వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించడానికి 6 రోజుల సమయం ఎందుకు పడుతుందని ఆయన ప్రశ్నించారు. ఈ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని చంద్రబాబు స్పష్టంచేశారు. తాను శని, ఆదివారాల్లో ఢిల్లీలోనే ఉండి పలు రాజకీయ పార్టీల అధినేతలతో సమావేశమై ఈ విషయం గురించి చర్చిస్తానని వెల్లడించారు.

10 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ అనేక గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. అనేక...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...