ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయని తమకు అనుమానంగా ఉందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో పలుచోట్ల ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగి ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణలో కేంద్ర ఎన్నికల సంఘం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. చంద్రబాబు శనివారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ ఆరోరాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరిగిన పోలింగ్ తీరుపై అసంతృప్తి వ్యక్తంచేశారు. ఏపీలో పోలింగ్ జరిగిన తీరు, ఈవీఎంల మొరాయింపు, అర్ధరాత్రి వరకు పోలింగ్ జరగడం వంటి విషయాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈసీ వైఖరిని తూర్పారబట్టారు. ఏపీ చరిత్రలోనే ఇలాంటి అరాచకాలను ఎన్నడూ చూడలేదన్నారు. ఎన్నికల సంఘం పూర్తిగా ప్రధాని మోదీ చెప్పినట్టే పనిచేస్తోందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఈసీ తనకు ఇష్టం వచ్చినట్టు అధికారులను బదిలీ చేసుకుంటూ వెళ్లిందని విమర్శించారు. వైఎస్సార్ సీపీ తప్పుడు ఫిర్యాదులను ఆధారంగా తీసుకుని కనీసం విచారణ కూడా జరిపించకుండా అధికారులను బదిలీ చేశారని ధ్వజమెత్తారు.
సీఎస్ ను ఇష్టానుసారం బదిలీ చేసి, జగన్ కేసులో సహ నిందితుడిగా ఉన్న వ్యక్తిని ఆ స్థానంలో నియమించారని, అసలు ఈ దేశం ఎక్కడికి పోతోందని ప్రశ్నించారు. ఈవీఎంలు పనిచేయని కారణంగా ఓటర్లు ఉదయం నుంచి తిండి, నీళ్లు లేకుండా లైన్లో ఉండాల్సి వచ్చిందని చెప్పారు. చాలాచోట్ల మధ్యాహ్నం ఒంటిగంటకు కూడా పోలింగ్ ప్రారంభం కాలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చాలామంది ఓటర్లు వెనుతిరిగి వెళ్లిపోయారని, దాంతో తాను ఓటేయాల్సిందిగా పిలుపునిస్తే.. మళ్లీ మధ్యాహ్నం 3 గంటల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు ఓటరు కేంద్రాలకు చేరుకున్నారని తెలిపారు. అది వారి కమిట్ మెంట్ అని, కానీ ఈసీ మాత్రం ఎన్నికల నిర్వహణలో ఘోరంగా విఫలమై, ప్రజల ఇబ్బందులకు కారణమైందని దుయ్యబట్టారు.
కొన్నిచోట్ల తెల్లవారేవరకు పోలింగ్ కొనసాగిందంటే ఇదేం ప్రజాస్వామ్యం అని ప్రశ్నించారు. రాష్ట్రానికి అవసరమైన మేర పోలీసు బలగాలను కూడా పంపకపోవడంతో రౌడీలు రాజ్యమేలారన్నారు. ఎక్కడిక్కడ దాడులకు తెగబడ్డారని, ఎమ్మెల్యే అభ్యర్థులతోపాటు స్పీకర్ పై కూడా దాడి చేశారని వివరించారు. ఎన్నికల్లో హింస చెలరేగి హత్యలు జరిగినా, మహిళలపై దాడి జరిగినా ఈసీ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఫలితంగా రాష్ట్రం రావణకాష్టంలా మారి, ప్రజాజీవనం స్తంభించిపోయిందన్నారు. ఈవీఎంల వినియోగంపై తాము మొదటి నుంచి పోరాడుతూనే ఉన్నామని గుర్తుచేశారు.
బ్యాలెట్ పేపర్ తో ఎన్నికలు నిర్వహిస్తే ఇలాంటి సమస్యలు ఉండవన్నారు. ప్రపంచంలోని చాలా దేశాలు బ్యాలెట్ పేపర్ వినియోగిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ఈవీఎంల విధానాలపై అందరికీ సందేహాలు ఉన్నాయని, అందువల్లే బ్యాలెట్ పేపర్ తో ఎన్నికలు నిర్వహించాలని తాము కోరుతున్నట్టు చెప్పారు.
వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించడానికి ఆరు రోజుల సమయం పడుతుందని సుప్రీంకోర్టుకు ఈసీ తప్పుడు సమాచారం ఇచ్చిందని దుయ్యబట్టారు. బ్యాలెట్ పేపర్లు లెక్కించడానికి 16 గంటల సమయం పట్టినప్పుడు వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించడానికి 6 రోజుల సమయం ఎందుకు పడుతుందని ఆయన ప్రశ్నించారు. ఈ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని చంద్రబాబు స్పష్టంచేశారు. తాను శని, ఆదివారాల్లో ఢిల్లీలోనే ఉండి పలు రాజకీయ పార్టీల అధినేతలతో సమావేశమై ఈ విషయం గురించి చర్చిస్తానని వెల్లడించారు.
230638 648151The most effective and clear News is really a lot imptortant to us. 781978
732549 489985Keep up the good work! 935717
311549 60800Hey there! Good stuff, please maintain me posted when you post something like this! 238770
477228 894794Thank you for the auspicious writeup. It in reality was a amusement account it. Appear complicated to far delivered agreeable from you! However, how can we keep in touch? 584771
409815 936653I visited lots of internet site but I conceive this 1 holds something extra in it in it 718042
316548 841237You ought to join in a contest very first with the greatest blogs on the internet. I will recommend this web web site! 313964
305061 470302Ill do this if need to as considerably as I hope that is not too far off the track. 413730
163424 202943Immigration […]the time to read or pay a visit to the content material or sites we have linked to below the[…] 536205
açık öğretim pdflerini indirebilirsiniz
730162 923455Glad to be 1 of several visitors on this awing web site : D. 258942