చిన్నమొత్తాల పొదుపు పథకాలకు సంబంధించి వడ్డీ రేట్లు తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంపై కేంద్రం వెనక్కి తగ్గింది. ఆయా పథకాలపై వడ్డీ తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని 24 గంటల్లోనే ఉపసంహరించుకుంది.
ఆర్థిక సంవత్సరం చివరి రోజు బుధవారం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్టు (ఎన్ఎస్ సీ), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) సహా చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను తగ్గించింది. పీపీఎఫ్ పై వడ్డీ రేటు 7.1 శాతం నుంచి 6.4 శాతానికి, ఎన్ఎస్ సీ వడ్డీ రేటును 6.8 శాతం నుంచి 5.9 శాతానికి తగ్గిస్తూ కేంద్ర ఆర్థికశాఖ ఉత్తర్వులు వెలువరించింది. పీపీఎఫ్ పై ఇంత తక్కువ వడ్డీ రేటు 1974 తర్వాత ఇదే అత్యల్పం.
ఈ నేపథ్యంలో ఏమైందో ఏమో తెలియదు కానీ.. ఆ ఉత్తర్వులు వెలువరించిన కొన్ని గంటల్లోనే కేంద్రం వెనక్కి తగ్గింది. వడ్డీరేట్ల తగ్గింపు ఉత్తర్వులు పొరపాటున జారీ అయ్యాయని.. గతేడాది ఆఖరి త్రైమాసికంలో ఉన్నట్లుగానే అన్ని పథకాలపై వడ్డీరేట్లు కొనసాగుతాయని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టంచేశారు. దీనిపై బుధవారం జారీ అయిన ఉత్తర్వులు ఉపసంహరించినట్టు చెప్పారు.
118410 235716Excellent post man, keep the good function, just shared this with my friendz 250029