నేను చేస్తున్న ఈ పోరాటం నా కోసం కాదు.. ప్రజల కోసం. నరకాసుర వధ కోసం చేస్తున్న ఈ పోరాటం లో అందరు కలిసి రావాలంటూ చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఆయన వైజాగ్ జిల్లా తాళ్లవలసలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ పై మరియు ఆ పార్టీ నాయకులపై తీవ్ర స్థాయిలో మండి పడ్డాడు. తాను రుషి కొండకు వెళ్తాను అంటే ప్రభుత్వం ఎందుకు అనుమతి ఇవ్వడం లేదు అంటూ బాబు ప్రశ్నించాడు.
జగన్ కన్ను పడ్డ ప్రతి చోట కూడా గోవిందా గోవిందా అన్నట్లుగా ఎద్దేవ చేశాడు. కోడి కత్తి, బాబాయి హత్య వంటి ఆలోచనల వల్ల జగన్ గెలిచాడు అంటూ బాబు ఆరోపించాడు. ఇప్పుడు అధికారంలో ఉన్నాం కదా అంటూ తోకలు ఆడిస్తున్న సైకోల తోకలను తాము అధికారంలోకి వచ్చాక కట్ చేసి తీరుతాం అంటూ చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ప్రతి తెలుగు దేశం పార్టీ కార్యకర్త కూడా వచ్చే ఎన్నికల కోసం కష్టపడి పని చేయాలంటూ పిలుపునిచ్చారు. వైకాపా రౌడీ పాలన గురించి ప్రజల్లోకి తీసుకు వెళ్లి మన పరిపాలన ప్రాముఖ్యతను తెలియజేయాలని సూచించారు.
112075 661619you made blogging glance 936527
114649 640636hello, your website is actually excellent. We do appreciate your give very good results 731605