Switch to English

పరకాల డాక్యుమెంటరీ: ఔను, రాజధాని విషాదమే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

ఎక్కడన్నా రాజధాని అంటే, అదొక సంబరం. కానీ, రాజధాని అమరావతిని ‘విషాదం’గా మార్చేసే ప్రయత్నం జరుగుతోంది. ఔను, రాజధాని అమరావతి ఓ విషాదమే. ఎందుకంటే, ‘ఏకైక రాజధాని అమరావతి’ అంటూ నినదించిన ఎన్నో గొంతుకలు అలసి సొలసి తుది శ్వాస విడిచాయి. ‘మాది రైతుల ప్రభుత్వం..’ అని చెప్పుకుంటోన్న వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం, అమరావతి రైతుల ఆవేదనను అర్థం చేసుకోలేకపోయింది.

ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికలయ్యాక ఓ మాట.! ఏరు దాటాక తెప్ప తగలేసిన చందాన, అమరావతిని ఎడారిగా, స్మశానంగా అభివర్ణించే స్థాయికి నిస్సిగ్గు రాజకీయాలు చేసింది అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ. ఇక, రాజధాని అమరావతికి సంబంధించి ‘రాజధాని విషాదం’ పేరుతో ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్‌ ఓ డాక్యుమెంటరీని రూపొందించారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ‘సలహాదారు’గా వ్యవహరించిన పరకాల ప్రభాకర్‌ ఈ డాక్యుమెంటరీని రూపొందించడం గమనార్హం.

ఇక, రాజధాని విషాద గాధ గురించి పరకాల ప్రభాకర్‌, తన డాక్యుమెంటరీలో ఆసక్తికరమైన విషయాల్నే ప్రస్తావించారు. రాజధాని అమరావతిపై చర్చ జరగాలనీ, అదే సమయంలో మూడు రాజధానుల అంశంపైనా చర్చ జరగాలని ఆకాంక్షించారు. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతాంగం గురించీ, ఈ క్రమంలో నడిచిన భూముల సమీకరణ అంశం గురించీ డాక్యుమెంటరీలో పేర్కొన్నారు. ఈ డాక్యుమెంటరీ పట్ల పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు నాయకులు కూడా, ‘రాజధాని విషాదం’ డాక్యుమెంటరీ చూసి, కంటతడి పెడుతున్న వైనం కనిపిస్తోంది. రాజధాని అంటే అది ఆత్మగౌరవంతో సమానం. ఢిల్లీ మన భారతీయుల ఆత్మగౌరవం. హైద్రాబాద్‌ అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం. అలాగే అమరావతి కూడా ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆత్మగౌరవం. దురదృష్టవశాత్తూ ఆ ఆత్మగౌరవం లాంటి అమరావతిని స్మశానమనీ, ఎడారి అనీ అభివర్ణిస్తున్నారు అధికార వైసీపీ నేతలు. పరకాల డాక్యుమెంటరీ రూపొందించారని కాదుగానీ, అమరావతి నిజంగానే ఓ విషాదం.

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాజధానిపై అధికార పార్టీ కుట్రలు చేయడం విషాదం కాక మరేమిటి.? ఎక్కడన్నా ఒకటి అద్భుతంగా కట్టి, ఆ తర్వాత ఇంకోదాని గురించి ఆలోచిస్తారు. కానీ, ఇక్కడ ఒకదాన్ని నాశనం చేసి (కూర్చున్న కొమ్మని నరికేసుకుని), ఇంకో రెండిటి గురించి ఆలోచిస్తున్నారు. ఇదీ వైపరీత్యమంటే.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree). కమలేష్ కుమార్ నిర్మాత. మే24న విడుదలవుతోన్న...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...