దక్షిణాదిన ఎలాగైనా పాగా వేయాలనే లక్ష్యంతో ముందుకు కదులుతున్న కమలనాథులు.. ఆ దిశగా తమ ప్రయత్నాలను మళ్లీ ముమ్మరం చేశారు. ముఖ్యంగా ఏపీలో ఇందుకు సంబంధించిన కసరత్తు వేగంగా సాగుతోంది. అధికార పార్టీలో ప్రవేశం లేని, ఆ పార్టీ లక్ష్యంగా చేసుకున్న నేతలను బీజేపీలోకి ఆహ్వానిస్తున్నారు.
ఏపీలో టీడీపీ అధికారం కోల్పోగానే ఆ పార్టీని ఖాళీ చేసే పనిలో కాషాయదళం నిమగ్నమైన సంగతి తెలిసిందే. టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులను పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పుడు ఆ ఎంపీల ద్వారానే ఆపరేషన్ టీడీపీ కొనసాగిస్తున్నారు. తాజాగా టీడీపీకి చెందిన ఇద్దరు కీలక నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్టు ప్రచారం సాగుతోంది. నేడో రేపో దీనికి సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.
రాయలసీమకు చెందిన కీలక నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కమలదళం వైపు చూస్తున్నట్టు సమాచారం. బీజేపీలో చేరడానికి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్ ద్వారా బైరెడ్డి ఢిల్లీ పెద్దలను కలిసి కాషాయ కండువా కప్పుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం.
ఇక టీడీపీలో కీలకమైన నేతగా గుర్తింపు ఉన్న వల్లభనేని వంశీ కూడా పార్టీ మారనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. శుక్రవారం ఆయన సుజనా చౌదరితో భేటీ కావడం దీనిని బలపరుస్తోంది. ఒంగోలు వెళుతూ గుంటూరులో ఆగిన సుజనాతో వంశీ సమావేశమై చర్చించినట్టు సమాచారం. అనంతరం ఆయనతో కలిసి ఒకే కారులో ఒంగోలు వెళ్లినట్టు చెబుతున్నారు.
ఇటీవల వంశీపై ఫోర్జరీ ఆరోపణలు వచ్చాయి. పోలీసులు కేసు నమోదు చేయడంతో ఆయన ఫైర్ అయ్యారు. తనపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో తనకు కేంద్రంలోని అధికార పార్టీ అండ అవసరమని వంశీ భావిస్తున్నారని, అందుకే సుజనా చౌదరితో సమావేశమయ్యారనే టాక్ వినిపిస్తోంది. వీటిని వంశీ అనుచరులు ఖండిస్తున్నప్పటికీ, దీపావళి తర్వాత కీలక పరిణామాలు సంభవించే అవకాశం ఉందని తెలుస్తోంది.
367898 438593Enjoyed reading by means of this, really great stuff, thankyou . 45294
193006 413254I totally agree! I came more than from google and am searching to subscribe. Exactly where is your RSS feed? 936630