బీఆర్ఎస్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా గుండె, కిడ్నీ సంబంధిత సమస్యలతో ఆయన బాధపడుతూ ఈనెల 16న యశోద ఆసుపత్రిలో చేరారు. షుగర్ లెవల్స్ పడిపోవడంతో కార్డియాటిక్ అరెస్ట్ తో ఈరోజు మృతి చెందారు. దీంతో ఆయన కుటుంబసభ్యులు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. సాయన్నకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
సాయన్న రాజకీయ జీవితం టీడీపీతో ప్రారంభమైంది. 1994, 1999, 2004, 2014 ఎన్నికల్లో గెలిచారు. 2014లో కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకరరావు చేతిలో ఓడిపోయారు. రాష్ట్ర విభజన అనంతరం బీఆర్ఎస్ లో చేరారు. 2015లో టీటీడీ పాలకమండలి సభ్యుడిగా ఉన్నారు. 2018లో బీఆర్ఎస్ తరపున కంటోన్మెంట్ నుంచి గెలుపొందారు. వివాదరహితుడిగా సాయన్న పేరు తెచ్చుకున్నారు.
సాయన్న మృతిపై సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సాయన్న ప్రజా జీవితంలో మమేకమయ్యారని అన్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. సాయన్న మృతిపై మంత్రి తలసాని యాదవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు.
541122 453367We keep your page. Watch it offline once again soon. Extremely fascinating post. 428149
996993 28665hey good website i will definaely come back and see once again. 767422
758732 35402I like the valuable info you offer in your articles. Ill bookmark your weblog and check once again here frequently. Im quite certain I will learn lots of new stuff proper here! Excellent luck for the next! 979768