లాక్ డౌన్ సందర్భంగా వలస కూలీల ఎన్ని కష్టాలు పడ్డారో తెలిసిన విషయమే. వారి దుర్భర స్థితిని తెలిపే మరొక ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. శ్రామిక్ రైలులో ప్రయాణించిన ఓ వలస కార్మికుడు రైలు టాయిలెట్ లో చనిపోయి కుళ్లిపోయిన దశలో బయటపడింది. మే 27న ఝాన్సీలో రైలు శుభ్రం చేస్తున్న క్రమంలో ఓ కార్మికుడు గుర్తించడంతో ఈ దారుణం వెలుగు చూసింది.
ఉత్తరప్రదేశ్లో బస్తీ జిల్లాకు చెందిన మోహన్లాల్ శర్మ మే 23న ఝాన్సీ నుంచి గోరఖ్పూర్ వెళ్లే శ్రామిక్ రైలు ఎక్కాడు. నాలుగు రోజుల తర్వాత తిరిగి ఝాన్సీ చేరుకుంది. రైలు శుభ్రం చేస్తున్న కార్మికుడికి టాయిలెట్లో కుళ్లిన శవం కనిపించింది. అధికారులకు విషయం తెలియజేయటంతో మోహన్లాల్ గా గుర్తించారు. శ్రామిక్ రైళ్లన్నీ ఆలస్యంగా నడిచాయన్న విషయం తెలిసిందే. దీంతో మోహన్ లాల్ టాయిలెట్ లో మరణించడం, కుళ్లిపోవడం జరిగింది. రైలు ఆలశ్యంతో ఈ ఘటన వెలుగు చూడడంలో ఆలశ్యమైందని రైల్వే అధికారులు అంటున్నారు.
మోహన్ లాల్ మే 24నే చనిపోయినట్టు పోస్టుమార్టంలో తేలిందని.. గాయాలు లేవని.. ఝాన్నీ రైల్వే డీఎస్పీ నయిమ్ ఖాన్ తెలిపారు. అవయవాలను ప్రత్యేక పరీక్షల కోసం పంపించాన్నారు. మోహన్ లాల్ వద్ద 23న కొన్న టికెట్, ఆధార్ కార్డ్, 27 వేల నగదు లభించడంతో భార్య పూజకు విషయం తెలియజేసారు పోలీసులు. భర్త మరణంపై పూజ మాట్లాడుతూ.. 23న ఆయనతో మాట్లాడానని తర్వాత ఫోన్ స్విచ్చాఫ్ వచ్చిందని కన్నీటిపర్యంతమైంది. మోహన్లాల్ కు భార్య, నలుగురు చిన్న పిల్లలు ఉన్నారు.
786885 742056Great humans speeches and toasts, possibly toasts. are hands down transferred at some time by means of party and expected to turn into really funny, amusing not to mention educational within the mean time. very best man wedding speeches 916334