‘వాపు’ని చూసి ‘బలుపు’ అనుకుంది భారతీయ జనతా పార్టీ తెలుగు రాష్ట్రాల్లో. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఖేల్ ఖతం కావడంతో, తాము ప్రతిపక్షంగా ఎదుగుదామనుకుంది బీజేపీ. ఆ దిశగా ప్రయత్నాలు కూడా ముమ్మరంగానే చేస్తోంది. కానీ, ఏం లాభం.? హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో కనీసం ఐదు వేల ఓట్లు కూడా సాధించలేకపోయింది కమలం పార్టీ.
మరి, ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి నాలుగు ఎంపీ సీట్లు ఎలా దక్కాయి.? అది మాత్రం మిస్టరీనే. ఆ ఎన్నికల్లో నిజంగా బీజేపీ ‘బలం’ నిరూపితమైతే, హుజూర్నగర్ ఉప ఎన్నికలో గెలిచినా గెలవకపోయినా గట్టి పోటీ ఇచ్చే స్థాయిలో ఆ పార్టీకి ఓట్లు వచ్చి వుండాలి. కాంగ్రెస్, టీఆర్ఎస్లతో సమానంగా హుజూర్నగర్లో బీజేపీ అస్త్ర శస్త్రాలన్నిటినీ మోహరించినా.. అత్యంత దారుణమైన పరిస్థితిని చవిచూసింది ఫలితాల్లో.
టీడీపీతో పోల్చుకుంటే బెటర్.. అని బీజేపీ అనుకోవచ్చుగాక. కానీ, ఇండిపెండెంట్ అభ్యర్థికి వచ్చిన ఓట్లు కూడా బీజేపీకి రాలేదు. తెలంగాణలో బీజేపీ పరిస్థితేంటో ఇంకోసారి నిరూపితమయ్యిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న వేళ, ఏపీలో తమ పరిస్థితిపై బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పార్టీ ఫిరాయింపులు, జంపింగ్ జపాంగులతో పార్టీ బలోపేతమవదనీ, ‘వాపు’ని చూసి ‘బలుపు’ అనుకుంటే ప్రమాదకరమనీ సుదీర్ఘ కాలంగా బీజేపీని నమ్ముకున్న భావిస్తున్నట్లుగా మాజీ కేంద్ర మంత్రి, బీజేపీలో ఇటీవల చేరిన ఒకప్పటి టీడీపీ నేత, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి మాటాల్ని బట్టి అర్థమవుతోంది.
అయితే, అంత రిస్క్ బీజేపీ అధిష్టానం చేసే అవకాశమే కన్పించడంలేదు. వున్నదీ పోయే.. డాష్ డాష్ కూడా పోయే.. అన్నట్లు తయారైపోతుంది ఒకవేళ బీజేపీ, ‘జమిలి’ ఎన్నికల్ని నమ్ముకుంటే.!