గుజరాత్ లో ఎన్నికల నగారా మోగిన విషయం తెల్సిందే. రెండు దశాబ్దాలుగా అధికారంలో ఉన్న బిజెపి ఈసారి కూడా విజయదుందుబి మోగించాలని ఆశిస్తున్నారు. డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు దశల్లో జరగనున్న ఎన్నికలకు సంబంధించి బిజెపి పోటీలో నిలిచే అభ్యర్థుల పేర్లను ఖరారు చేయనుంది.
ఈ నేపథ్యంలో ప్రముఖ క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజాకు బిజెపి టికెట్ దక్కనున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. ఆమెకు టికెట్ దక్కడం కన్ఫర్మ్ అయినట్లు చెబుతున్నారు. రాజ్ పుత్ వర్గానికి చెందిన కర్ణిసేన నాయకురాలైన రివాబా 2016లో రవీంద్ర జడేజాను వివాహం చేసుకున్నారు. ఆమె మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. మూడు సంవత్సరాల క్రితం బిజెపిలో చేరారు.
ఇక ఆమెకు టికెట్ దక్కడం లాంఛనమే అంటున్నారు. ఇదిలా ఉంటే 75 ఏళ్ళు పైబడిన వాళ్లకు టికెట్ ఇవ్వకుండా పార్టీ పక్కనపెడుతుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి విజయ్ రూపానికి టికెట్ దక్కబోదని సమాచారం.
443089 133566Oh my goodness! an amazing write-up dude. Thank you Even so My business is experiencing issue with ur rss . Dont know why Unable to subscribe to it. Can there be anyone obtaining identical rss difficulty? Anybody who knows kindly respond. Thnkx 740644
329381 863655fantastic post, really informative. I wonder why the other experts of this sector do not notice this. You must continue your writing. Im confident, youve a terrific readers base already! 750624