Switch to English

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ఆశలన్నీ ఆ ‘వాక్యూమ్’ పైనే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

2024 ఎన్నికల్లో అధికారం దక్కించుకోవడం భారతీయ జనతా పార్టీకి అంత ఈజీ కాదని అంటున్నారు ఆ పార్టీ సీనియర్‌ నేత రాం మాధవ్‌. ఈ విషయం చెప్పడానికి సీనియర్‌ పొలిటీషియన్‌ అవనక్కర్లేదు.. చంటి పిల్లాడినడిగినా చెప్పేస్తాడు, ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ పరిస్థితి ఏంటని అడిగితే.! 2019 ఎన్నికల్లో తెరవెనుకాల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి సహకారమందించిన బీజేపీ, తాను తీసుకున్న గోతిలో తానే పడింది. ఒక్క శాతం ఓటు బ్యాంకు కూడా రాబట్టుకోలేకపోయింది.

‘వైసీపీకి వచ్చిన సీట్లన్నీ ఆ పార్టీవే కాదు.. అందులో వాటా మాక్కూడా వుంది..’ అంటూ ఈ మధ్యనే ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడైన సోము వీర్రాజు ఓ ఇంటర్వ్యూలో నోరు జారేశారు. ఇక, రాం మాధవ్‌ తాజా వ్యాఖ్యల విషయానికొస్తే, ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ప్రతిపక్షం ఖాళీగా వుందనీ, ఆ స్థానం భర్తీ చేయాలంటే గ్రౌండ్‌ లెవల్‌లో పార్టీ కార్యకర్తలు కష్టపడాలనీ, నేతలంతా కలిసి ఒకే మాట మీద నిలబడి పార్టీని నిలబెట్టాలనీ అభిప్రాయపడ్డారు.

‘కన్నా లక్ష్మినారాయణను తీసేసి, సోము వీర్రాజుని పార్టీ అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టారని అనుకోవడం సబబు కాదు. కన్నా లక్ష్మినారాయణకు ఇంకా మంచి పదవి వచ్చే అవకాశం వుంది..’ అని రాం మాధవ్‌ వ్యాఖ్యానించడం గమనార్హం. పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక తక్కువ సమయంలోనే ఎన్నికలు వచ్చాయనీ, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో తనవంతు కృషి చేశానని కన్నా లక్ష్మినారాయణ చెప్పుకొచ్చారు.

ఇక, బీజేపీ తాజా అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ, రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తాననీ, చంద్రబాబు.. వైఎస్‌ జగన్‌.. ఇద్దరూ అవినీతి విషయంలో ఒకరితో ఒకరు పోటీ పడ్తారని, ఆ రెండు పార్టీలకూ తాము సమదూరం పాటిస్తామని చెప్పుకొచ్చారు. ‘జనసేన పార్టీతో కలిసి రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తాం.. భారతీయ జనతా పార్టీ, ఆంధ్రప్రదేశ్‌కి ఏమేం గొప్ప గొప్ప విషయాల్ని గడచిన ఆరేళ్ళలో చేసిందో చెబుతాం..’ అన్నారు సోము వీర్రాజు.

ఏదిఏమైనా, రాష్ట్రంలో పొలిటికల్‌ వాక్యూమ్ వుందన్నది నిర్వివాదాంశం. అది ప్రతిపక్షానికి సంబంధించిన వాక్యూవ్‌ు కావొచ్చు.. అధికార పక్షానికి చెందిన వాక్యూమ్ కావొచ్చు. పైకి గంభీరంగా కన్పిస్తున్నా, అధికార వైసీపీలోనూ చాలా లొసుగులు కన్పిస్తున్నాయి.. అందుకు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు సహా పలువురు వైసీపీ ముఖ్య నేతల ‘అసంతృప్తి’ ఇందుకు నిదర్శనం. మరి, ఆ వాక్యూమ్ ని బీజేపీ – జనసేన ఉపయోగించుకోగలుగుతాయా.? వేచి చూడాల్సిందే.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree). కమలేష్ కుమార్ నిర్మాత. మే24న విడుదలవుతోన్న...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...