Switch to English

బిగ్ బాస్4: ఎపిసోడ్56-నోయల్‌ వెళ్లి పోతూ ఆ ముగ్గురిని ఎత్తాడు, ఆ ఇద్దరిని తోసేశాడు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

బిగ్‌ బాస్‌ నుండి మరో షాకింగ్‌ ఎలిమినేషన్‌ జరిగింది. అనారోగ్య కారణాలతో బయటకు వెళ్లిన నోయల్‌ మళ్లీ లోనికి వెళ్లడం లేదు. ఆయనకు ట్రీట్‌మెంట్‌ అవసరం అంటూ వైధ్యులు నిర్ణయించిన కారణంగా నోయల్‌ ను మళ్లీ హౌస్‌లోకి పంపడం లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. నిన్నటి ఎపిసోడ్‌ కు ఎవరు హోస్ట్‌ అంటూ వచ్చిన వార్తలపై క్లారిటీ ఇస్తూ నాగార్జున వచ్చేశాడు. వైల్డ్‌ డాగ్‌ షూటింగ్‌ స్పాట్‌ నుండి ఎయిర్‌ పోర్ట్‌ వరకు చాప్టర్‌ లో అక్కడి నుండి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ చేరుకున్నాడు. బిగ్‌ బాస్‌ కోసం ప్రత్యేకంగా ఆయన ఈ ప్రయాణం చేశాడు. ఆ విషయాన్ని కూడా నిన్నటి ఎపిసోడ్‌ లో చూపించారు. ఇక రావడం రావడంతోనే నాగార్జున కన్ఫెషన్‌ రూంకు కొందరిని పిలిచి గొడవలు పెంచే ప్రయత్నం చేశాడు. క్లారిటీ ఇస్తున్న పేరుతో కావాలని హౌస్‌ లో హీట్‌ పెంచారు.

హౌస్‌లో ఇన్ని రోజులు జరిగిన జర్నీలో మీకు విలన్‌ ఎవరు అంటూ ఒకొక్కరుగా ముళ్ల కిరీటం పెట్టాల్సి ఉంటుంది. ఆ విషయంలో ఇంటి సభ్యులు అందరు కూడా మొహమాటం లేకుండా తమకు ఎవరైతే విలన్‌ అనుకున్నారో వారికి కిరీటం పెట్టి ఎందుకు అనే విషయమై క్లారిటీ ఇచ్చారు. అఖిల్‌ వెళ్లి తన విలన్‌ అభిజిత్‌ అన్నాడు. ప్రస్తుతం పరిస్థితులు బాగానే ఉన్న ఇంతకు ముందు జరిగిన జర్నీలో విలన్‌ అభిజిత్‌ అనడంతోఅభిజిత్‌ కూడా షాక్‌ అయ్యాడు. సోహెల్‌ తనకు స్వీట్‌ విలన్‌ అరియానా అంటూ చెప్పి పెట్టాడు. ఇక లాస్య వెళ్లి అవినాష్‌ విలన్‌ అంటూ కిరీటం పెట్టింది. అలాగే అవినాష్‌ కూడా లాస్యనే తన విలన్‌ అంటూ కిరీటం పెట్టాడు. అరియానా తన విలన్‌గా అఖిల్‌ ను చెప్పింది. అభిజిత్ చివరగా తన విలన్‌ అమ్మా రాజశేఖర్‌ అన్నాడు.. మోనాల్‌ విషయంకు వచ్చేప్పటికి లాస్యను విలన్‌ గా భావిస్తున్నట్లుగా చెప్పంది. ఇది జరిగిన తర్వాత అఖిల్‌ ను సేవ్‌ చేశారు.

నోయల్‌ స్టేజ్‌ పైకి రావడంతో అంతా కూడా విష్‌ చేశారు. ఎప్పుడు వస్తావు అంటూ ఎదురు చూస్తున్నాను అంటూ అంతా అన్నారు. ఆసమయంలో నాగార్జున ఇక నోయల్‌ రాడు అని చెప్పడంతో అంతా షాక్‌ అయ్యారు. ముఖ్యంగా హారిక ఏడుస్తూనే ఉంది. నా బ్యాక్‌ బోన్‌ తను అంటూ హారిక చెప్పిన వివరణ ప్రతి ఒక్కిరిని కదిలించింది అనడంలో సందేహం లేదు. ఇక నోయల్‌ వెళ్లి పోయే ముందు అయిదుగురు విషయంలో వ్యవహరించిన తీరు విమర్శలు ప్రశంసలు తెచ్చి పెట్టింది. నా స్నేహితులు అయిన అభిజిత్‌, లాస్య, హారికలు ఫైనల్‌ 5 లో ఉండాలని కోరుకుంటున్నాను. మీరు ఉంటారు మీ కోసం నేను ఉన్నాను అన్నాడు. ఇక అమ్మ రాజశేఖర్‌ మరియు అవినాష్‌ లపై నోయల్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.

అమ్మ మరియు అవినాష్‌ లను రెండు నిమిషాల పాటు ఒక కాలుపై నిలబడమన్నాడు. ఆ తర్వాత ఆ బాధ ఏంటో అర్థం అయ్యిందా అంటూ తనలో ఉన్న ఆవేదనను వెళ్లగక్కాడు. అంతకు మించి వెయ్యి రెట్ల నొప్పితో నేను బాధపడుతుంటే నా బాధను కామెడీ చేశారు. నా పెయిన్‌ను అవహేళన చేశారు. ఇదేనా కామెడీ అంటే అంటూ ఇద్దరిపై విమర్శలు చేశాడు. అందుకు అవినాష్‌ చాలా సీరియస్‌ అన్నాడు. ఇన్ని రోజులు చేసిన కామెడీకి నవ్వేసిన నువ్వు ఇప్పుడు బయటకు వెళ్లి ఇలా మాట్లాడటం ఏంటీ, ఇన్ని రోజులు సేఫ్‌ గేమ్‌ ఆడి ఇప్పుడు బయటకు వెళ్లగానే ఇద్దరిని బ్యాడ్‌ చేయాలని చూడటం ఎంత వరకు కరెక్ట్‌ అంటూ అవినాష్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఎన్నో సార్లు నీ ముందు చేసినా కూడా నవ్వావు. అప్పుడే ఎందుకు అనలేదు అంటూ అవినాష్‌ ప్రశ్నించిన సమయంలో నోయల్‌ సైలెంట్‌ అయ్యాడు. మొత్తానికి ఆ ముగ్గురిని లోపే ప్రయత్నం చేసి అవినాష్‌ మరియు అమ్మను మాత్రం కిందకు తోసేందుకు నోయల్‌ చాలా గట్టిగా ప్రయత్నించాడు. నోయల్‌ పనికి నెటిజన్స్‌ కూడా మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొందరు నోయల్‌కు మద్దతుగా కొందరు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...